పరకాల నేటిధాత్రి
హనుమకొండ జిల్లా పరకాల మున్సిపాలిటీలోని స్థానిక ఒకటవ వార్డులో కౌన్సిలర్ మడికొండ సంపత్ కుమార్ సోమవారం రోజున సిఎస్ ఐ కాలనిలో గల అంగన్వాడీ కేంద్రాలను సందర్శించారు.అనంతరం పిల్లలతో కాసేపు సరదాగా గడిపి చిన్నారులకు అక్షరాబ్యాసం చేసారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ మెనూ లో ఉన్న ప్రకారం పిల్లలకు పోషక ఆహారాన్ని అందించాలని గుడ్లు,బాలామృతం అందించాలని అన్నారు.ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్స్,ఆయాలు,తదితరులు పాల్గొన్నారు.