డిఎస్పి రామ్మోహన్ రెడ్డి
మలహార్ రావు. నేటిధాత్రి :
భూపాలపల్లి జిల్లా మల్హర్ రావు మండలంలోని కొయ్యూరులో కాటారం డిఎస్పి రామ్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో మంగళవారం కార్డెన్ సర్చ్ నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలోని లైసెన్సులు, నెంబర్ ప్లేట్ లేని బైకులను స్వాధీనం చేసుకొని యజమానులకు కౌన్సిలింగ్ ఇచ్చి పంపించారు. అదేవిధంగా గుడుంబా, గంజాయి, సైబర్ క్రైమ్రై నేరాలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో సిఐ నాగార్జున రావు ఎస్సై వడ్లకొండ నరేష్, పోలీస్ సిబ్బంది, సిఆర్పిఎఫ్ పోలీసులు పాల్గొన్నారు.