
Prabhakar Reddy
సహకార సంఘాలు రైతులకు మేలు”
బాలానగర్/ నేటి ధాత్రి
మహబూబ్ నగర్ జిల్లా బాలానగర్ మండల కేంద్రంలో మండల సహకార కేంద్రంలో బుధవారం అంతర్జాతీయ సహకార దినోత్సవం -2025 ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సింగిల్ విండో డీసీఎంఎస్ చైర్మన్ పట్ల ప్రభాకర్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నిరుపేద రైతులు సహకార సంఘాలలో రుణాన్ని తీసుకొని ఉజ్వల భవిష్యత్తును పెంపొందించుకున్నారని, పేదల సంక్షేమానికి సహకార సంఘాలు కృషి చేస్తున్నయన్నారు. మధ్యతరగతి కుటుంబాల అభివృద్ధికి సహకార సంఘాలు సహకరిస్తాయన్నారు. ఈ కార్యక్రమంలో సహకార సంఘాల సభ్యులు పలువురు రైతులు పాల్గొన్నారు.