వాడిన నూనె పదే పదే వాడటం వల్ల క్యాన్సర్,గుండెజబ్బులకు దారి
ప్రజల ప్రాణాలతో చెలగాటాలు ఆడుతున్న వ్యాపారస్థులు
పరకాల నేటిధాత్రి
హన్మకొండ జిల్లా పరకాల పట్టణంలో మిర్చి బజ్జి బండ్ల వ్యాపారులు ప్రజల ప్రాణాలతో చెలగాటలు ఆడుతున్నారు.వాళ్ళు వాడుతున్న నూనెను చూస్తే ఆచర్యపోవాల్సిందే అది నూనెనా లేక వాహనాలలో వాడే ఇంజన్ ఆయిల్ నా అని మనకే సందేహం కలిగేలా ఉంటుంది.పరకాల పట్టనానికి పరిసర ప్రాంత ప్రజలు సాయకాలం పూట సరదాగా స్నేహితులతో,చిన్నపిల్లలతో గడపడానికి రోడ్డుకు వచ్చి ఏదో ఒకటి తినాలని ఆశతో మిర్చి బండిలా దగ్గరకు వెళ్లి ఇష్టంగా ఎగ్ బజ్జిలు,మిర్చి బజ్జిలు తింటుటారు అయితే ఇక్కడే వచ్చింది పెద్ద చిక్కు తోపుడు బండ్లపైన బజ్జిలు చేసే వ్యక్తులు ఏ మాత్రం పరిశుభ్రత పాటించకుండా ఒక్క రోజు వాడగానే మార్చే నూనెను రోజుకి రోజు మార్చకుండా వాడిన నూనెనే దాదాపు వారం కుదిరితే నెల రోజులు తేర్చి తేర్చి వాడుతు జనాల ప్రాణాలతో చాలగాటలాడుతున్నారు.ఎవరైనా ఏంటీ ఇది అని అడిగితే మీరు ఇచ్చే వాటికి ఇంతకంటే మంచినూనె వాడాలా అని అంటున్నారంట నూనె ఎక్కువరోజులు వాడటం ద్వారా క్యాన్సర్,కొలస్ట్రాల్ పెరిగి గుండెజబ్బులు ఇతర సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది.తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాన్ని చేసుకోవాలన్నా నెపంతో నాశిరకం నూనెలను విక్రయించి వాడుతున్నారు.సంబంధిత ఫుడ్ అధికారులు పట్టించుకొని వ్యాపారస్థుల మీద కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజల ఆరోగ్యలను కాపాడాలని కోరుకుంటున్నారు.