
ముఖ్యమంత్రి రేవంత్ సమక్షంలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్న ఎమ్మెల్యే అరికపూడి గాంధీ
శేరిలింగంపల్లి, నేటి ధాత్రి:- శేరిలింగంపల్లి నియోజకవర్గం ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ శనివారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. జూబ్లీహిల్స్ లోని ముఖ్యమంత్రి నివాసంలో కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆహ్వానించారు. ఎమ్మెల్యే గాంధీతో పాటు శేరిలింగంపల్లి నియోజకవర్గానికి చెందిన పలువురు కార్పొరేటర్లు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. శేరిలింగంపల్లి కార్పొరేటర్ నాగేందర్ యాదవ్, మియాపూర్ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్, చందానగర్ కార్పొరేటర్ మంజుల రఘునాధ్ రెడ్డి, హైదర్ నగర్ కార్పొరేటర్ నార్నె శ్రీనివాస్ తదితరులు ఎమ్మెల్యే గాంధీ తో కలిసి కాంగ్రెస్ పార్టీలో చేరారు.