అభివృద్ధి కి ఆకర్షితులై బీఆర్ఎస్ లోకి కొనసాగుతున్న చేరికలు

నేటి ధాత్రి (హుజూర్ నగర్)

శనివారం హుజుర్ నగర్ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో శాసన సభ్యులు శానంపూడి సైదిరెడ్డి సమక్షంలో 50 మంది యువకులు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా వారికి పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వాన్ని బలపరుస్తూ, ఎమ్మెల్యే సైదిరెడ్డికి సంపూర్ణ మద్దతు తెలుపుతూ తెలంగాణ రాష్ట్రం,హుజుర్ నగర్ మరింత అభివృద్ధి చెందాలి అని ,ప్రస్తుతం జరుగుతున్న అభివృద్ధి పనులు, రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలు కొనసాగాలని,అలాగే నియోజకవర్గ పరిధిలోని అన్ని పట్టణాలు, గ్రామాలు మరింత అభివృద్ధి చెందాలి అంటే బీఆర్ఎస్ పార్టీతోనే సాధ్యం అని వారి పూర్తి మద్దతు తెలుపుతూ శనివారం నాడు బీఆర్ఎస్ పార్టీలో చేరడం జరిగింది. ఈ కార్యక్రమంలో శీలం వెంకన్న ఆరోగ్యమే మహాభాగ్యం ట్రస్ట్ అధ్యక్షులు, వేముల లక్ష్మణ్ రాజు వైఎస్ఆర్టీపీ పట్టణ యువజన సంఘం అధ్యక్షులు, వెంకటేష్ సోషల్ వర్కర్, బండారు రాము.పట్టణ, గ్రామ స్థానిక ప్రజాప్రతినిధులు ముఖ్య నాయకులు కార్యకర్తలు,వారి అనుచరులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!