నియోజకవర్గ సమీక్ష సమావేశం నిర్వహించిన..

Constituency

*నియోజకవర్గ సమీక్ష సమావేశం నిర్వహించిన..

*చల్లా రామచంద్రారెడ్డి చల్లా బాబు రెడ్డి..

పుంగనూరు(నేటి ధాత్రి) మార్చి 26:

 

పుంగనూరు నియోజకవర్గం సోమల మండలం నందు తెలుగుదేశం పార్టీ ఆదేశానుసారం క్లస్టర్ ఇన్ చా ర్జులు, భూత్ ఇన్ చార్జీ
లు,యూనిట్ ఇన్
చార్జీ ల తో నియోజకవర్గ
స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించిన పుంగనూరు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ చార్జీ చల్లా రామచంద్రారెడ్డి (చల్లా బాబు రెడ్డి)
ఈ సందర్భంగా చల్లా రామచంద్రారెడ్డి మాట్లాడుతూ
తెలుగుదేశం పార్టీ కార్యకర్త రామకృష్ణ ని కోల్పోవడం చాలా బాధాకరం తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా కొంతమంది అధికారులు ఇంకా వైయస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులతో కుమ్మక్కై ఉన్నారని వారి మీద ముఖ్యమంత్రి దృష్టికి తీసుకొని వెళ్లి చర్యలు తీసుకుంటామని తెలియజేశారు.

Constituency
Constituency

గత 20 సంవత్సరాలుగా పుంగనూరు నియోజకవర్గంలో భూ కబ్జాలు అక్రమాలు దౌర్జన్యాలు చేశారని ఇకమీదట వారి ఆటలు సాగని సాగనివ్వమని హెచ్చరించారు.
పుంగనూరు నియోజకవర్గంలో పార్టీ కోసం కష్టపడి అనేకమంది జైలుకు వెళ్లారని అటువంటి వారికి అందరికీ తగిన గుర్తింపు ఇస్తామని గ్రామాలలో మరియు కార్యకర్తలకు ఎటువంటి సమస్యలు ఉన్న తమ దృష్టికి తీసుకువస్తే పది రోజుల్లోనే సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.
అదేవిధంగా పార్టీ కోసం కష్టపడిన వారికే ప్రాధాన్యత ఉంటుందని అటువంటి వారికే పదవులు వరిస్తాయని తెలియజేశారు,ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు
భూత్ ఇన్, చార్జులు, యూనిట్ఇన్చార్జులు , క్లస్టర్ ఇన్చార్జులు మరియు పార్టీ అనుబంధ కమిటీ సభ్యులు పాల్గొన్నారు…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!