•చిన్నపిల్లలు చెరుల వద్దకు వెళ్లొద్దు
•స్థానిక ఎస్సై శ్రీనివాస్ రెడ్డి
నిజాంపేట: నేటి ధాత్రి
వినాయక చవితి పండుగను పురస్కరించుకొని నిజాంపేట మండల కేంద్రంలో గల మల్కచెరువు స్థలాన్ని మంగళవారం స్థానిక ఎస్సై శ్రీనివాస్ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వినాయకులను నిమజ్జనం చేయడానికి అనువైన స్థలాన్నీ పరిశీలిస్తున్నామన్నారు. ప్రతి సంవత్సరం మల్కచెరువులోనే నిమర్జనం చేస్తారని అదేవిధంగా ఈసారి కూడా ప్రశాంత వాతావరణంలో నిమజ్జనం చేయాలని సూచించారు. వర్షాలకు చెరువులు నిండి నిండుకుండల ఉన్నందున చిన్న పిల్లలు ఎవరు కూడా చెరువుగట్టు వద్దకు రావద్దని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి నరసింహులు, కానిస్టేబులు తదితరులు పాల్గొన్నారు.