పాక్ను తాత్కాలికంగా దెబ్బకొట్టగలిగాం
ఉగ్రవాదం సమసిపోదు
ఈసారి పాక్, చైనాలు మరింత జాగ్రత్తపడక మానవు
భవిష్యత్తులో ఆధునిక ఆయుధాలు, సాంకేతికత యుద్ధ ఫలితాలను నిర్ణయించలేవు
ఆపరేషన్ సింధూర్తో బలూచ్ ఉద్యమానికి ఊతం
పాక్ను లంగదీయడానికి సింధూజలాలే బ్రహ్మాస్త్రం
క్యాన్సర్లా తొలిచేస్తున్న అంతర్గత శత్రువులు
హైదరాబాద్,నేటిధాత్రి:
ఏప్రిల్ 22న పహల్గామ్ దాడికి ప్రతీకారంగా మనదేశం పాకిస్తాన్లోని తొమ్మిది ఉగ్రస్థావరాలనుధ్వసం చేయడమే కాకుండా సుమారు వందమంది ఉగ్రవాదులను హతమార్చింది. ఇదే సమ యంలో పాకిస్తాన్కు చెందిన 11 వైమానిక స్థావరాలను ధ్వంసం చేయడమే కాదు, దాని ఆణ్వస్త్ర ప్రాంతాలపై దాడిచేయగలమన్న సంకేతాన్ని స్పష్టంగా అందించింది. మరి ప్రపంచంలోనే అ త్యంత ధూర్త దేశమైన పాకిస్తాన్కు ఈశిక్ష సరిపోతుందా? అనేది ప్రధాన ప్రశ్న. ఎందుకంటే విధించే శిక్ష ఎదుటివాడిలో భయం కలగడానికి లేదా ఇకముందు ఎటువంటి దుశ్చర్యలకు పాల్పడకుండా వుండటానికి నిర్దేశించినదై వుంటుంది. కానీ ధూర్త దేశమైన పాకిస్తాన్ ఈ చర్యతో గుణపాఠం తెచ్చుకుంటుందని అనుకుంటే అంతకుమించిన అమాయకత్వం మరోటుండదు. ఆపరేషన్ సింధూర్ వల్ల పాకిస్తాన్ తాత్కాలికంగా దెబ్బతినుండవచ్చు, కానీ దాని బుద్ధి మార్చుకునేందటి స్థాయిలో గాయం కలిగించలేదన్నది మాత్రం వాస్తవం. అటువంటప్పుడు ఈ ఆపరేషన్ వల్ల మనం సాధించిందేంటి? కలిగిన లాభనష్టాలేంటనే ప్రశలు సహజంగానే ఉదయిస్తాయి.
ఈ ఆపరేషన్ వల్ల అద్భుతమైన మన సాంకేతిక పరిజ్ఞానం, మన ఆయుధసంపత్తి పాటవం, త్రివిధ దళాల సమన్వయ సామర్థ్యం ప్రపంచానికి వెల్లడయ్యాయి. ఇది మనకు కలిగిన మొదటి ప్రయోజనం. పహల్గామ్ సంఘటనకు ప్రతీకారంగా భారత్ బహుశా బాలాకోట్ లేదా అంతకంటే కొంచెం ఎక్కువ స్థాయిలో ప్రతికారదాడులకు పాల్పడవచ్చునని పాకిస్తాన్ వ్యూహకర్తలు, సైన్యంఅంచనా వేసివుండవచ్చు. కానీ ఈ స్థాయిలో భారత్ దాడిచేస్తుందని వారు కల్లోకూడా ఊహించి వుండకపోవచ్చు. ఒకవేళ ఆవిధంగా అంచనావేసినట్లయితే పాకిస్తాన్ తప్పనిసరిగా తగిన జాగ్ర త్తలు తీసుకొని వుండేది. అందుకు చైనా దన్ను ఎలాగూ దానికి వుంది. ఈసారి మనం దాడులుతలపెడితే పాక్ స్పందన కచ్చితంగా భిన్నంగా మరింత సామర్థ్యంతో వుండితీరుతుంది. శత్రువు అజాగ్రత్తగా వున్నప్పుడు లేదా అంచనా సరిగ్గా వేయనప్పుడు మనం చేసిన దాడి ఉత్తమ ఫలితాలిచ్చిన మాట వాస్తవం. కానీ ఈసారి పరిస్థితి ఈవిధంగా వుండకపోవచ్చు. అదీకాకుండా ధ్వంసమైనవన్నీ చైనా ఆయుధాలు కనుక, చైనా అహంకారం పూర్తిగా దెబ్బతిన్నది. అంతేకాదు అంతర్జాతీయంగా దాని ఆయుధమార్కెట్ కుప్పకూలిపోయే పరిస్థితి ఏర్పడిరది. ఈ నేపథ్యంలో పాకి స్తాన్ను మరింత బలోపేతం చేసి భారత్ను మరింత దీటుగా ఎదుర్కొనేందుకు అవసరమని భా వించిన తమవద్ద ఉన్న ఉత్తమ ఆయుధాలను దానికి సమకూర్చే అవకాశాలే ఎక్కువ. చేతిలో చిల్లిగవ్వలేని పాకిస్తాన్కు ఇదొక అయాచితవరంగా మారకూడదనేంలేదు. ఎందుకంటే ప్రస్తుతం భారత్ తన సామర్థ్యం విషయంలో చైనాను కూడా దాటిపోయిందన్న సందేశం ప్రపంచ దేశాల కు వెళ్లింది. ఇదే సమయంలో ఇప్పటివరకు ప్రపంచానికి వెల్లడికాని చైనా ఆయుధ పాటవంలోని డొల్లతనం ప్రస్ఫుటంగా తెలిసిపోయింది. పాకిస్తాన్కు ఇప్పటికే ఏవిధమైన పరువు లేదు కనుక ఈ ఓటమితో దానికి పోయిందేమీ లేదు. కానీ చైనా ప్రతిష్ట తీవ్రంగా దెబ్బతిన్నదన్న మాట వాస్తవం. పోయిన ప్రతిష్టను నిలుపుకునేందుకు చైనా అనుక్షణం అవకాశం కోసం ఎదురుచూ స్తుంటుంది. ఇప్పుడు చైనా తన ప్రతిష్ట కాపాడుకోవడం కోసం పాక్ను తన ఆయుధ సంపత్తితో మరింత బలోపేతం చేసి భారత్ తనకు సరిసమానంగా ప్రపంచం పరిగణించకుండా వుండటానికి ప్రయత్నించి తీరుతుంది. అమెరికాను మించిపోవాలని ప్రయత్నిస్తున్న చైనా, తనకు సవాలు విసిరే స్థాయిలో భారత్ను ఎంతమాత్రం చూడలేదు. దాని దౌర్భాగ్యమేంటంటే అమెరికాతో వాణిజ్య యుద్ధం, ఆపరేషన్ సింధూర్ పుణ్యమాని కుప్పకూలుతున్న డిఫెన్స్ మార్కెట్, మరోవైపు ప్ర పంచ తయారీ హబ్గా ఇప్పటివరకు సుస్థిరంగా కొనసాగిన తన పేరు క్రమంగా దెబ్బతింటుండటం, అంతర్గతంగా కుప్పకూలుతున్న ఆర్థిక వ్యవస్థ వంటివి చైనాను పట్టిపీడిస్తున్నాయి. అందువల్ల భారత్తో 1962 నాటి దుస్సాహసం ఇప్పుడు చేయడం సాధ్యంకాదు. కేవలం తన ప్రాక్సీ పాకిస్తాన్ ద్వారానే తన లక్ష్యాలు సాధించుకోవాలని చూస్తుంది. ఇక పాకిస్తాన్ జనరల్స్, ఆర్మీ చీఫ్ అసీమ్ మునీర్ వంటివారు జిహాదీ ఉద్యమం ద్వారానే తమ పదవులను సుస్థిరం చేసుకోవాలని చూస్తారు కనుక వారు ఉగ్రవాద నెగళ్లను ఎగదోస్తారు తప్ప విరమించుకోరు. ఇక జిహాదీ ఉగ్ర వాదులు తమ మనసుల్లో నాటుకుపోయిన ‘‘ఆత్మబలిదానం ద్వారా 72మంది అప్సరసలను చేరుకోవడం’’ అనే ఒక విచిత్ర విశ్వాసం నుంచి బయటకు రాలేరు. దీనివల్ల ఉగ్రవాదం సమసిపో దు. ఉగ్రవాదులు పుట్టుకొస్తూనే వుంటారనేదానికంటే మతఛాందసులు ఇటువంటి ప్రలోభాలతో ఉగ్రవాదుల ఉత్పత్తిని కొనసాగిస్తూనే వుంటారనుకోవడం సమంజసం.
పరివర్తనశీలమైన ఈ ప్రపంచంలో అనుక్షణం యుద్ధతంత్రం మారిపోతున్నది. రాబోయే యుద్ధా లు భౌతికం కంటే సాంకేతికత, కృత్రిమమేథ ఆధారంగా జరుగుతాయని ఆపరేషన్ సింధూర్ చెప్పకనే చెప్పింది. రాబోయేకాలంలో ఎఫ్`16, ఎఫ్`35, ఎస్యు`57, సుఖోయ్, రాఫెల్ వంటి యుద్ధవిమానాల వల్ల పెద్దగా ప్రయోజనం వుండకపోవచ్చు. ఎందుకంటే యుద్ధరీతి డ్రోన్ల వినియోగంవైపు మళ్లింది. అజర్బైజాన్`అర్మీనియా యుద్ధం డ్రోన్ల ప్రాధాన్యతను తెలియజేస్తే, ఆపరేషన్ సింధూర్ డ్రోన్లను నిలువరించే రక్షణ సాంకేతికత ఆవశ్యకతను ప్రపంచానికి వెల్లడిరచింది. ఇంతగా సాంకేతికత మారిపోతున్నప్పటికీ, సంప్రదాయికంగా వస్తున్న జిహాదీ ఉగ్రవాదంలో కూడా ఇవేరకమైన సాంకేతిక పరిజ్ఞానాలు ఉపయోగించే కాలం రాకమానదు. అంటే సాంకేతిక ప్రగతి అనేది ఒక నిరంతర ప్రక్రియ. దానికి అంతుండదు!
ఇప్పటికి ఆపరేషన్ సింధూర్లో ఉపయోగించిన సాంకేతిక పరిజ్ఞానం, సమన్వయం విలువ ప్ర పంచానికి వెల్లడైంది కనుక ఈ రెండు అంశాల్లో రాబోయేకాలంలో మరిన్ని కొత్త ఆవిష్కరణలు జరగవచ్చు. అందువల్ల భారత్ రాబోయేకాలంలో సరికొత్త వ్యూహాత్మక పద్ధతులు అనుసరించక తప్పదు. అయితే పాకిస్తాన్ను కట్టడిచేయడానికి ఈ సాయుధ పోరాటం లేదా సంఘర్షణ ఎంతమాత్రం పనిచేయవన్నది సుస్పుష్టం. ఈ నేపథ్యంలో భారత్ సాంకేతిక అభివృద్ధితో పాటు జిహాదీ ఉగ్రవాదాన్ని ఎదుర్కొనడానికి కొన్ని ‘ఉప`సంప్రదాయిక’ పద్ధతులు అనుసరించక తప్పదు. ప్రస్తుతం మనదేశం వీటిని అనుసరిస్తున్నది కూడా! 2030 నాటికి ప్రపంచంలో మూడో ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతుందన్న అంచనాల నేపథ్యంలో భారత్ ఈవిధంగా సైనిక సంఘర్షణలకు దిగడంఅభివృద్ధిపరంగా ఆత్మహత్యా సదృశమే అవుతుంది. అదీకాకుండా మనల్ని ఆర్థికంగా దెబ్బకొట్టా లనుకునే పాక్, చైనాలకు ఇది వరంలా మారుతుంది కూడా!
ఈ పరిస్థితుల్లో పాకిస్తాన్కు నిద్రపట్టకుండా చేయాలంటే, అంతర్గత సంఘర్షణలను చల్లారకుం డా ఎగదోయడమే మార్గం. ఉదాహరణకు ఆపరేషన్ సింధూర్ వల్ల, బలూచ్ విమోచనోద్యమానికి ఎంతో ప్రోత్సాహం లభించింది. పాక్ రక్షణ వ్యవస్థలను, వాయుసేన స్థావరాలను ధ్వంసం చేయడంవల్ల దెబ్బతిన్న పాక్ సైన్యంపై బలూచ్ వీరులు మరింత విరుచుకుపడే అవకాశం లభిం చింది. ప్రస్తుతం ఇది జరుగుతున్నది కూడా. మూలిగే నక్కమీద తాటిపండు పడినట్టు స్వతంత్ర బలూచిస్తాన్ను బలూచ్ సాయుధులు ప్రకటించడం, పాకిస్తాన్కు కోలుకోలేని దెబ్బ. తన సైన్యాన్ని పూర్తి సాయుధ సంపత్తితో బలూచ్లపై దాడులకు ఉపయోగించలేని పరిస్థితి. ఇప్పటికే ఆర్థి కంగా దివాలాతీసిన స్థితిలో ఇంతటి ఖర్చును పాక్ భరించలేదు. పోనీ చావోరేవో అని బలూచ్ల పై సైనిక చర్య తీసుకుంటే, వాయువ్య ప్రాంతంలో తాలిబన్లు కాచుకు కూర్చున్నారు. పీఓకేలో ప్రజల నిరసనలు తీవ్రస్థాయిలో కొనసాగుతున్నాయి. అయితే వీటికి పెద్దగా మీడియా కవరేజీ రావడంలేదు. పంజాబ్ రాష్ట్రం తమకు నీళ్లు వదలడంలేదంటూ సింధూ రాష్ట్ర ప్రజలు ఆందోళన చేస్తున్నారు. ఇప్పుడు ఏకంగా సింధూ నదీ జలాలను భారత్ ఆపేయడంతో, అసలు మొత్తానికే పాక్ విలవిలలాడుతోంది. నీరు వదలక పోతే రక్తం పారుతుందని బీరాలు పలికిన నాయకులు ఇప్పుడు నోరు మెదపడంలేదు. మన జలశక్తి వనరుల శాఖకు పాకిస్తాన్ ఒక లేఖరాసింది. నీటి ఎద్దడి తీవ్రంగా వుంది…సిందూ జలాలను దిగువకు వదలమన్నది ఆ లేఖ సారాంశం. పాక్ వంటి ధూర్తదేశానికి తక్షణ మరియు శాశ్వత ఇబ్బందిని కలిగించేది సింధూనదీ జలాలు మాత్రమే నన్నది ప్రస్తుతం సుస్పష్టమైంది. భారత ప్రభుత్వం ఈ విషయంలో ఇప్పటివరకు కఠినవైఖరినే అనుసరిస్తోంది.
మరో ముఖ్య విషయమేంటంటే భారత్ాపాక్ల మధ్య యుద్ధాన్ని ఆపేసింది తానేనని ట్రంప్ ప్రచారం చేసుకుంటున్నారు. ఒబామాకు నోబెల్ ప్రైజ్ వచ్చినట్టుగానే తనకు కూడా శాంతి బహు మతి రావాలన్నది ఆయన ఆకాంక్ష కావచ్చు. అయితే చైనా విషయంలో ట్రంప్ అనుసరించినట్టు గా మనం కూడా పూర్తి శత్రుత్వ వైఖరితో వ్యవహరించే పరిస్థితి లేదు. ఇది చైనాకూ వర్తిస్తుంది. ఇప్పటికీ మనదేశంలోని చాలా పరిశ్రమలు ముఖ్యంగా ఔషధరంగానికి కావలసిన ముడిసరుకు చైనానుంచే సరఫరా అవుతుంది. రెండు దేశాల మధ్య వాణిజ్యలోటు చాలా అధికం. డోనాల్డ్ ట్రంప్ ఈ వాణిజ్యలోటును అధిగమించడానికి టారిఫ్ల యుద్ధానికి తెరతీశారు. ఇదేవిధానం నుసరిస్తే అంతకుమించిన మూర్ఖత్వం మరోటుండదు. ఇప్పటికీ వాణిజ్యం విషయంలో చైనాను మనం పక్కన పెట్టలేం. అందువల్ల ఈ లోటును పూడ్చుకోవడానికి ఇతర మార్గాలు ఎన్నుకోవ డం తప్ప ప్రస్తుతానికి మనం చేయగలిగిందేమీ లేదు. ముఖ్యంగా మనం కూడా ప్రపంచ తయారీ హబ్గా తయారవాలంటే ఇప్పటికప్పుడు సాధ్యమయ్యేదీ కాదు. అందువల్ల ఔనన్నా కాదన్నా చైనాతో మనకు ‘శత్రుామిత్ర’ మిశ్రమ వైఖరి అనుసరించక తప్పదు.
అన్నింటికన్నా మనదేశానికి అత్యంత ప్రమాదకరంగా మారిన అంశం మరోటుంది. అంతర్గతం గా పనిచేస్తున్న దేశవ్యతిరేకులు మరియు అతిచైతన్య దేశభక్తులతో ఇబ్బంది ఏర్పడుతోంది. ఉగ్రస్థావరాలపై దాడులు జరిపిన తర్వాత, పాక్ మనపై యుద్ధానికి ఉపక్రమిస్తే, మనదేశంలో శాంతి కాముకుల లాబీ ఒక్కసారిగా చైతన్యవంతమైంది. యుద్ధంవల్ల అంతా నష్టమే కాబట్టి మనం తక్షణం ఉపసంహరించుకోవాలంటూ ఈ శాంతికాముక లాబీ సుద్దులు చెప్పడం మొదలుపెట్టింది. అంతేకాదు ఉగ్రస్థావరాలను ధ్వంసంచేసి భారత్ తన సామర్థ్యాన్ని ప్రపంచానికి వెల్లడిస్తే, ఈ విజయాన్ని కూడా బలహీనపరచే స్థాయిలో వీరి కథనాలు వెలువడటం విచిత్రం. పహల్గాంలో అమాయకుల ప్రాణాలు తీసిన ఉగ్రవాదుల చర్యను మరుగునపడేసి, మనం చేపట్టిన ఆపరేషన్ సింధూర్ వల్ల తీవ్ర నష్టం వాటిల్లుతుందని, యుద్ధం మంచిదికాదంటూ వీరి ప్రచారం కొనసా గింది. ఇక అతిచైతన్య దేశభక్తులు సాధ్యాసాధ్యాలు ఆలోచించకుండా పీఓకేను ఆక్రమించాల్సింది ప్రభుత్వం ఈ అవకాశాన్ని చేజేతులారా వదిలేసిందంటూ వీరి భావోద్వేగాలు! ప్రభుత్వంలో వి ధానకర్తలు, పటిష్ట నాయకత్వం అటువంటి అంశాలపై క్షుణ్ణంగా పరిశీలించి చర్యలు తీసుకుం టారు. అంతేకాని, తాత్కాలిక భావోద్వేగాలకు లేదా యుద్ధంవల్ల నష్టం వస్తుందని చెప్పే సుద్దులను వారు పట్టించుకోరు. ఆపరేషన్ సింధూర్ వల్ల మన ప్రతిష్ట పెరగడమే కాదు, డిఫెన్స్ రంగ ఉత్పత్తుల ఎగుమతుల విషయంలో మనకు సానుకూల వాతావరణం ఏర్పడిరదన్నది సత్యం. ప్రపంచం మనల్ని చూసే విధానంలో సమూలంగా మార్పు తీసుకొచ్చింది. దీన్ని ఈ రెండు వర్గాలుగుర్తించాలి.