Congress Supports BC Bandh in Telangana
బీసీ బంద్ కు కాంగ్రెస్ మద్దతు
– ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్
సిరిసిల్ల (నేటి ధాత్రి):
బీసీ సంఘాల పెద్దలు 42 శాతం రిజర్వేషన్ రాజకీయంగా ఇవ్వాలని 18న ఇచ్చిన తెలంగాణ బంధుకు జిల్లా కాంగ్రెస్ పక్షాన మద్దతు ఇస్తున్నామని
సిరిసిల్ల ప్రెస్ క్లబ్ లో విలేకరుల సమావేశంలో మాట్లాడిన ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్.
ఈ సందర్భంగా ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం ఇచ్చిన మాట కోసం బీసీలకు 42 శాతం విద్యా, ఉద్యోగ, రాజకీయ రిజర్వేషన్ కోసం కృషి చేసినమని అన్నారు. అసెంబ్లీలో బిల్లులను పాస్ చేసుకుని కేంద్రానికి పంపడం జరిగిందని అన్నారు.కాంగ్రెస్ కృత నిశ్చయంతో ముందుకు పోతున్న తరుణంలో హై కోర్ట్ స్టే రావడం జరిగిందని అన్నారు.
ప్రజలను మేల్కొలిపే విధంగా బీసీ సంఘాలు ఇచ్చిన తెలంగాణ బంద్ కు కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షుడు సంఘీభావం తెలిపారని అన్నారు.
బంద్ కు అన్ని వర్గాల ప్రజలు స్వచ్ఛందగా సహకరించాలని అన్నారు.
కోర్టులో న్యాయపరంగా కొట్లాడుతాం, న్యాయ నిపుణులతో సంప్రదింపులు జరుతున్నాం మాకు పూర్తి ఆశాభావం ఉందని అన్నారు.
బిజెపి నాయకులు కేంద్ర ప్రభుత్వం వద్దకు బిల్లులు వెళితే 8 మంది ఎంపీలు, ఎమ్మెల్యేలు ఎందుకు ఒప్పించడం లేదని
ప్రశ్నించారు.
బీసీలకు నోటి కాడికి వచ్చిన బుక్కను లాక్కోవద్దని బిజెపి నాయకులను కోరుతున్నామని అన్నారు.
రాజ్యాంగంలో 50 శాతం క్యాబ్ ఎక్కడా లేదు అని అన్నారు.
కోర్టులో సవాలు చేసిన వారు జీఓ 9 జీవోను సవాల్ చేశారు కానీ చట్టాన్ని కాదనీ అన్నారు.
బీసీ రిజర్వేషన్ల కోసం చిత్త శుద్ధితో మేం ముందుకు పోతున్నామని, బిజెపి నాయకులు కూడా ఆలోచన చేయాలని అన్నారు.
18న జరిగే బంద్ లో అన్ని వర్గాల ప్రజలు పాల్గొనాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ స్టేట్ కోఆర్డినేటర్ సంగీతం శ్రీనివాస్, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు చొప్పదండి ప్రకాష్,బిసి అధికార ప్రతినిధి పర్ష హన్మండ్లు, చేనేత సెల్ అధ్యక్షులు గోనే ఎల్లప్ప, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు సూర దేవరాజు, బొప్ప దేవయ్య, మేకల కమలాకర్ తదితరులు పాల్గొన్నారు.
పాల్గొన్నారు
