డ్రామారావు అసత్య ఆరోపణలను ఖండించిన కాంగ్రెస్ ప్రతినిధి బర్ల సహదేవ్
*మీ 10 ఏండ్ల పాలనపై, కాంగ్రెస్ పార్టీ 2 ఏండ్ల పాలనపై చర్చకు సిద్ధమా అని సవాలు విసురుతున్న
వర్దన్నపేట (నేటిధాత్రి ):
జూబ్లీహిల్స్ లో జరిగిన ఉప ఎన్నికల్లో ఓటమి, ఈ -కార్ రేస్ అవినీతి పై విచారణకు గవర్నర్ అనుమతి ఇచ్చేసరికి చిన్న మెదడు చితికి, మతి బ్రమించి సీఎం రేవంత్ రెడ్డి గారి పై అసత్య ఆరోపణలు చేస్తున్న డ్రామారావు అలియాస్ టిల్లు వాక్యాలను తీవ్రంగా ఖండిస్తున్న వర్దన్నపేట నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి బర్ల సహాదేవ్ (అడ్వకేట్ )
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఓటమితో బిఆర్ఎస్ కు పట్టపగలే చుక్కలు కనిపించాయి.కుంభ కోణలు చేసేది మీరు. మీ 10 ఏండ్ల పరిపాలన కాలంలో అన్ని కుంబకోణలే అందువల్లే మీ బిఆర్ఎస్ పార్టీని ప్రజలు చిత్తుగా ఓడగొట్టారు.
హిల్టప్ (హైదరాబాద్ పారిశ్రమిక భూముల బదిలీ విధానం) పై అసత్య ఆరోపణలు మానుకోవాలి.
పెట్టుబడులు తెచ్చి ఉపాధి అవకాశాలు పెంచలనే తమ ఉద్దేశలను వక్రీకరిస్తూ KTR పచ్చి అబద్దాలు చెప్పడం సరికాదు.తెలంగాణ రాష్ట్రము అభివృద్ధి కొరకు నిరంతరం కృషి చేస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు
ఈ-కార్ రేస్ అవినీతి పై గవర్నర్ గారు విచారణకు అనుమతి ఇచ్చేసరికి ప్రజల దృష్టిని మల్లించేందుకే సీఎం రేవంత్ రెడ్డి గారిపై అసత్య ఆరోపణలు చేయడం సరికాదు. ప్రజా క్షేత్రంలోకి రా చూసుకుందాం అంతే తప్ప ఇలాంటి అబద్ధ ఆరోపణలు చేయడం మానుకోవాలి లేకపోతే రానున్న రోజుల్లో తెలంగాణ ప్రజలు స్థానిక సంస్థల ఎన్నికల్లో పూర్తిగా మిమ్మల్ని మీ పార్టీని చీత్తు చిత్తు గా ఓడగొట్టి మీకు బుద్ధి చెప్పడం జరుగుతుంది.
