“పేదల సంక్షేమానికి కాంగ్రెస్ పార్టీ కృషి”
“భూ సమస్యల పరిష్కారానికి భూభారతి”
ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి
దేవరకద్ర నేటి ధాత్రి
మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర నియోజకవర్గం కొత్తకోట మండలం మిరాస్ పల్లి గ్రామంలో నిర్వహించిన భూభారతి గ్రామ రెవెన్యూ సదస్సులో ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి శుక్రవారం పాల్గొన్నారు.
ఈ సందర్భంగాఎమ్మెల్యే మాట్లాడుతూ..
భూ సమస్యలను శాశ్వతంగా పరిష్కరించాలనే ఉద్దేశంతోనే రాష్ట్ర ప్రభుత్వం భూభారతి చట్టాన్ని తీసుకువచ్చిందని అన్నారు.
భూ సమస్య ఏదైనా ఉంటే గ్రామంలోకి వచ్చిన అధికారులకు దరఖాస్తు చేసుకోవాలని..
రెవెన్యూ సదస్సులో మీరు ఇచ్చిన దరఖాస్తులను పరిశీలించి, సమస్యను అధికారులు పరిష్కరిస్తారన్నారు.

అనంతరం గ్రామంలో వడ్డెర, యాదవ సంఘాల కమ్యూనిటీ హాల్స్ పెండింగ్ పెండింగ్ పనులకు, కుర్వ సంఘం కమ్యూనిటీ హాల్ కాంపౌండ్ వాల్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు మరియు ఇందిరమ్మ ఇంటి లబ్ధిదారురాలు తెలుగు బాలమ్మ ఇంటి నిర్మాణానికి నిర్వహించిన భూమి పూజ కార్యక్రమంలో పాల్గొని, తదనంతరం ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు యూనిఫామ్స్ పాఠ్యపుస్తకాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఉపాధ్యాయులు, గ్రామస్తులు పాల్గొన్నారు.