హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో జరగబోయే కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షుల సమ్మేళనం బహిరంగ సభను విజయవంతం చేయండి
➡ మాజీ మంత్రివర్యులు జహీరాబాద్ నియోజకవర్గ ఇంచార్జ్ డా౹౹ఎ.చంద్రశేఖర్
జహీరాబాద్ నేటి ధాత్రి:
జై బాపు,జై భీమ్, జై సంవిధాన్ కార్యక్రమంలో భాగంగా తెలంగాణ రాష్ట్రంలోని అన్ని గ్రామాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుల సమేళనం నిర్వహిచబడుతుంది.ఈ కార్యక్రమాన్ని పూర్తి స్థాయిలో విజయవంతం చేసేందుకు జహీరాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులతో మాజీ మంత్రి డా౹౹చంద్రశేఖర్ సమావేశం ఏర్పాటు చేసి గ్రామ స్థాయి నాయకులకు దిశా నిర్దేశం చేసి ఈ బహిరంగ సభలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు హన్మంత్ రావ్ పాటిల్,రామలింగారెడ్డి , శ్రీనివాస్ రెడ్డి,మాక్సూద్ అహ్మద్,పట్టణ అధ్యక్షులు కండేం.నర్సింలు,బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు ఆర్షద్ అలీ,సామెల్,మరియు కాంగ్రెస్ నాయకులు వెంకట్ రెడ్డి,వేణుగోపాల్ రెడ్డి,రచన్న,తదితరులు పాల్గొన్నారు.