కస్తూర్బా గాంధీ పాఠశాలను సందర్శించిన కాంగ్రెస్ పార్టీ శ్రేణులు.

తలకొండపల్లి/ నేటి ధాత్రి.

తలకొండపల్లి మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలను సోమవారం స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు సందర్శించారు. ఈ సందర్భంగా పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ.. విద్యార్థులు ప్రతినిత్యం అప్రమత్తంగా ఉండాలని పాఠశాల ఆవరణ చుట్టు అపరిచిత వ్యక్తులు, పోకిరీలు విద్యార్థులకు ఇబ్బందులు కలిగించేలా వ్యవహరిస్తే.. స్థానిక ఉపాధ్యాయ సిబ్బందికి, పోలీసులకు, స్థానిక నాయకులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. గత కొన్ని రోజులుగా హాస్టల్లో వ్యక్తిగత గదులలో సీసీ కెమెరాలు పెట్టి ఇబ్బందులకు గురి చేస్తున్న సంఘటనలు జరుగుతున్నాయని, ఇలాంటివి జరగకుండా ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలన్నారు. పాఠశాలలో విద్యార్థులకు అందజేస్తున్న భోజనాన్ని పరిశీలించి ప్రభుత్వం మెస్ చార్జీలు పెంచినందున విద్యార్థులకు ఇబ్బందులు లేకుండా చూడాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు తుమ్మ నరసింహ, మల్లేష్, గణేష్,యాదగిరి, నరసింహారెడ్డి, యాదగిరి, మల్లేష్ , పురుషోత్తం, సురేష్, రాజశేఖర్ రెడ్డి, వెంకటేష్ ,రాఘవేందర్ రెడ్డి, మైసయ్య తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!