అంబేద్కర్ గారికి నివాళులర్పించిన కాంగ్రెస్ పార్టీ.

Congress party

జహీరాబాద్ పట్టణంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి నివాళులర్పించిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు డా౹౹సిద్దం.ఉజ్వల్ రెడ్డి.

జహీరాబాద్. నేటి ధాత్రి:

 

 

డా.బిఆర్ అంబేద్కర్ గారి జయంతిని పురస్కరించుకొని జహీరాబాద్ పట్టణంలోని డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహానికి పూలమాలవేసి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు డా౹౹సిద్దం.ఉజ్వల్ రెడ్డి ఘనంగా నివాళులర్పించారు.అనంతరం జహీరాబాద్ పట్టణంలో డా౹౹బాబా సాహెబ్ అంబెద్కర్ జయంతి ఉత్సవ కమిటీ వారు నిర్వహించిన డా౹౹బాబా సాహెబ్ అంబెద్కర్ జయంతి ఉత్సవ సభకి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.ఈసందర్భగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు డా౹౹సిద్దం.ఉజ్వల్ రెడ్డి మాట్లాడుతూ..ఆర్థికవేత్త రాజా నీతిజ్ఞుడు భారత రాజ్యాంగ రూపకర్త మహానీయుడు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి విగ్రహానికి జహీరాబాద్ పట్టణంలో పూలమాలవేసి నివాళులర్పించడం చాలా సంతోషకరంగా ఉందన్నారు.యావత్ భారత్ మొత్తం రాజ్యాంగ రూపకర్త డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ గారి ఆశయాలను సాధించాలని ఈ సందర్భంగా కోరుకున్నారు.ఈకార్యక్రమంలో జహీరాబాద్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పి.నర్సింహారెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ మంకాల్ సుభాష్.కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ రాష్ట్ర వైస్ చైర్మన్ భీమయ్య,డిసిసి ఉపాధ్యక్షుడు ముల్తాని,మాజీ జెడ్పీటీసీలు రాందాస్,నరేష్,మాజీ సర్పంచ్ నర్సింహారెడ్డి,మాజీ కౌన్సిలర్లుశేఖర్,తాహేరా బేగం,మైనార్టీ సెల్ నియోజకవర్గ అధ్యక్షుడు జమిలాలోద్దిన్,యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు న్యాల్కల్ మండల అధ్యక్షుడు జి.కిరణ్ కుమార్ గౌడ్,మాజీ ఏఎంసి వైస్ చైర్మన్ అక్బర్,బార్ అసోసియేషన్ అధ్యక్షుడు గోపాల్,మైనార్టీ సెల్ టౌన్ అధ్యక్షుడు జావిద్,హర్షద్ పటేల్,అశ్విన్ పాటిల్,తాహేర్ పాటిల్,కె.జగదీశ్వర్ రెడ్డి,రాజు నాయక్,సునీల్,నర్సింహా యాదవ్,అక్షయ్ జాడే,రాజు,జహీర్ అరబ్బీ,ప్రమోద్, జగదీష్,మోహిన్,నిజాం మరియు అంబేద్కర్ జయంతి ఉత్సవ కమిటీ సభ్యులు,మాజీ సర్పంచ్ లు,మాజీ యం.పి.టి.సిలు,మాజీ కౌన్సిలర్లు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మరియు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!