కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి కడియం కావ్యను గెలిపించాలని

భూపాలపల్లి నేటిధాత్రి

వరంగల్ ఎంపీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కడియం కావ్యను గెలిపించాలని కోరుతూ భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని 4, 22, 23 వార్డుల్లో భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు ఆదేశాల మేరకు భూపాలపల్లి పట్టణ అధ్యక్షుడు ఇస్లావత్ దేవన్ ఆధ్వర్యంలో కాంగ్రెస్, సిపిఐ, సిపిఎం పార్టీల నాయకులు, కార్యకర్తలు కలిసి మూకుమ్మడిగా ఇంటింటా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు దేవన్, సిపిఎం జిల్లా కార్యదర్శి బందు సాయిలు మాట్లాడుతూ తెలంగాణలో జరిగిన అసెంబ్లీ ఎన్నికలల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను 100 రోజుల్లో ఐదు గ్యారెంటీలను పూర్తి చేశామని తెలిపారు. కేంద్రంలో కాంగ్రెస్ పార్టీని అత్యధిక మెజారిటీతో గెలిపించి రాహుల్ గాంధీని ప్రధానిగా చేయడం లక్ష్యంగా ప్రతి ఒక్కరు ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఐదు గ్యారెంటీ హామీలతో మేనిఫెస్టో విడుదల చేసిందని ఇచ్చిన హామీలను 100 శాతం పూర్తి చేస్తామని తెలిపారు. కేంద్రంలో నరేంద్ర మోడీని గద్దెదించే వరకు పోరాడాలని వారు కోరారు. మునిసిపాలిటీ పరిధిలో ప్రచారం నిర్వహిస్తున్న తరుణంలో ప్రజల నుండి భారీ స్పందన వస్తుందని అన్నారు. ఈ ప్రచార కార్యక్రమంలో సిపిఐ కార్యదర్శి సోత్కు ప్రవీణ్, కాంగ్రెస్ పార్టీ నాయకులు సల్లూరి సమ్మయ్య, కౌన్సిలర్లు, నంద్యాల రవీందర్, దాట్ల శ్రీనివాస్, చిరుత అనిల్ , పిల్లలమర్రి నారాయణ, కురిమిళ్ళ రజితశ్రీనివాస్, పట్టణ వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్ పిప్పల రాజేందర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఖ్యాతిరాజు సాంబమూర్తి, పైడిపల్లి రమేష్, తాటి అశోక్, ఆకుల మల్లేష్ గౌడ్, చెరుకు తోట శ్రీరాములు, వార్డు నాయకులు హఫీజ్, సతీష్, సునీల్, అనిల్, మహిళలు, తదితరులు అధిక సంఖ్యలో ప్రచారంలో పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!