చిట్యాల, నేటి ధాత్రి :
జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలంలోని చల్లగరిగ గ్రామ యువజన కాంగ్రెస్ నాయకులు అల్లే నాగరాజు తండ్రి అల్లే రాజయ్య మరణించడం జరిగింది. మృతుని కుటుంబాన్ని గురువారం రోజున మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గూట్ల తిరుపతి పరామర్శించడం జరిగింది.
ఆయన వెంట మండల ప్రధాన కార్యదర్శి గడ్డం కొమురయ్య, యూత్ అధ్యక్షుడు అల్లకొండకుమార్, యూత్ నాయకులు గోల్కొండ నాగరాజు, నాయకులు పాల్గొనడం జరిగింది.