Foundation Ceremony for New Panchayat Building
నూతన గ్రామ పంచాయతీ భవననిర్మాణానికి ముగ్గు పోసిన
కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు దొడ్డ బాలాజీ
ముత్తారం :- నేటి ధాత్రి
ఐటి శాఖ మంత్రిదుద్దిళ్ల శ్రీధర్ బాబు
ఆదేశాల మేరకు ముత్తారం మండలం
జిల్లెలపల్లి గ్రామంలో నూతన గ్రామ పంచాయతీ భవనానికి సంప్రదాయబద్ధంగా మాజీ జడ్పీటీసీ చొప్పరి సధానందం మండల అధ్యక్షుడు దొడ్డ బాలాజీ ఆధ్వర్యంలో ముగ్గు పోయడం కార్యక్రమం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ గడ్డం రాజేశం మాట్లాడుతూ గ్రామ అభివృద్ధికి ప్రతి ఒక్కరు సహకరించాలని కోరారు. ఉపసర్పంచ్ జన్నె శ్రీవాణి ప్రవీణ్ గ్రామ పంచాయతీ భవనం నిర్మాణం గ్రామ అభివృద్ధికి ముఖ్యమైన మైలురాయిగా నిలుస్తుందని తెలిపారు
ముఖ్య అతిథులుగా జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు ఎక్స్ జడ్పీటీసీ చొప్పరి సదానందం , మండల అధ్యక్షులు దొడ్డ బాలాజీ ,వాజిద్ పాషా (మైనార్టీ సెల్ మండల అధ్యక్షులు), అల్లం కుమారస్వామి (ఓబీసీ సెల్ మండల అధ్యక్షులు) హాజరై గ్రామ అభివృద్ధి కార్యక్రమాలపై ప్రసంగించి నూతన పంచాయతీ భవనం గ్రామ ప్రజలకు ఎంతో ఉపయోగకరమని తెలిపారు.
ఈ కార్యక్రమంలో వార్డుమెంబెర్స్ గడ్డం గట్టయ్య,చిగురు పోచయ్య, రుద్రవేణ రేవతి-శంకర్, సిద్ద సమ్మయ్య, అనవేన తిరుమల-సాయికుమార్ సీనియర్ నాయకులు, గ్రామ పెద్దలు, మహిళలు, యువకులు మరియు గ్రామ ప్రజలు పాల్గొని కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.
