కాంగ్రెస్ పార్టీ కుంభకోణాల పార్టీ …!

# డిజిటల్ రంగంలో ప్రపంచ దేశాలతో పోటి పడుతున్న భారత్..
# ములుగు జిల్లాకు గిరిజన యూనివర్సిటీ,రామప్పను యునెస్కో గుర్తింపుకు మోడీ ప్రభుత్వం కృషి..


# రిజర్వేషన్లపై, బిజెపిపై విష ప్రచారం చేస్తున్న కాంగ్రెస్..
# కాంగ్రెస్ పార్టీని దేశ ప్రజలు నమ్మే స్థితిలో లేరు..
# నర్సంపేట భాజపా ఎన్నికల ప్రచారంలో ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ దామి తీవ్రవిమర్శలు.

# బీఅర్ఎస్ పార్టీ కవితకు ఓటు హక్కును మలినం అవుతుంది.
# కాంగ్రెస్ అభ్యర్థి నోరు విప్పితే అబద్ధాలే..
# భాజపా అభ్యర్థి ప్రొఫెసర్ సీతారాం నాయక్..

నర్సంపేట,నేటిధాత్రి :

దేశంలో గత పాలనలో కాంగ్రెస్ పార్టీ కుంభకోణాల పార్టీగా మారిందని నేడు ఆ పార్టీని దేశంలో ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని ఉత్తరాఖండ్ భాజపా సీఎం పుష్కర్ సింగ్ దామి ఆరోపించారు.భాజపా మహబూబాబాద్ పార్లమెంట్ అభ్యర్థి సీతారాం నాయక్ గెలుపు కోరుతూ
వరంగల్ జిల్లా నర్సంపేటలో బిజెపి జన సభ నిర్వహించారు.ముఖ్య అతిథిగా ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ దామి హాజరై మాట్లాడారు.ముందుగా అందరికీ నమస్కారం అని తెలుగులో మాట్లాడుతూ ప్రసంగం మొదలుపెట్టారు.ములుగు జిల్లాలో సమ్మక్క సారలమ్మ గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు చేసింది, రామప్పకు యునెస్కో గుర్తింపు తెచ్చిన పార్టీ బిజెపి అని పేర్కొన్నారు.మహబూబాబాద్ పార్లమెంటు అభ్యర్థి
సీతారాం నాయక్ పనితీరు మీకు తెలుసు అని ఆదివాసీ,గిరిజన ప్రజలకు అండగా ఉంటాడని అన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో దేశం అన్ని రంగాల్లో అభివృద్ధిలో దూసుకు పోతుందన్నారు.దేశాన్ని డిజిటల్ రంగంలో ప్రపంచ దేశాలతో పోటి పడే దేశంగా ప్రధాని మోడీ నిలిపారని అన్నారు.కుల,మతాల రిజర్వేషన్లపై తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం బిజెపిపై విష ప్రచారం చేస్తున్నారని అవేదన వ్యక్తంచేశారు.కాంగ్రెస్ పార్టీ అంటేనే ఒక కుంభకోణాల పార్టీ అని
నేడు దేశంలో కాంగ్రెస్ పార్టీని ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని ఎద్దేవా చేశారు.కేంద్రంలో మోడీ అధికారంలోకి
వచ్చిన తర్వాతనే దేశం అభివృద్ధి పథంలో నడుస్తుందని చెప్పారు.తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రైతు రుణమాఫీతో పాటు ఇచ్చిన హామీలను నెరవేర్చ లేదని మోసపూరిత హమిలిచ్చిన కాంగ్రెస్ పార్టీని ప్రజలు నమ్మరని ఉత్తర్ఖాండ్ సీఎం ఆరోపించారు.తెలంగాణలో 6 గ్యారెంటీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పథకాల అమలులో చేయలేదని మహిళలకు నెలకు 2500 వస్తున్నాయని అని అక్కడికి వచ్చిన వారికి అడిగారు.మహబుబాబాద్ జిల్లా పార్లమెంటు బిజెపి అభ్యర్థి ప్రొఫెసర్ సీతారాం నాయక్ పై ప్రజల ఆశీస్సులుండాలని,ఇక్కడ గెలుస్తేనే దేశంలో అధికారంలోకి మరోసారి వస్తారని ఓటర్లను ఉద్దేశించి ఆయన పేర్కొన్నారు.తెలంగాణలో బీఅర్ఎస్ నేత కేసీఆర్ కూతురు స్కాముల కేసులో జైల్లో ఉన్నదని,కాంగ్రెస్ అదే స్థితిలో ఉన్నదని అవి రెండు పార్టీలు ఒక్కటే అని ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ దామి తీవ్ర విమర్శలు చేశారు.ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటే రేటెంత్ రెడ్డి అని భాజపా రాష్ట్ర స్పోక్ లీడర్ రాణి రుద్రమాదేవి తీవ్ర విమర్శలు చేసింది.ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చిన అబద్ధపు మాటల గుంపుమేస్త్రి అని ఎద్దేవా చేశారు.డిసెంబర్ 9 న రైతుల రుణమాఫీ, 100 రోజుల్లో 6 గ్యారంటీలను అమలు చేస్తానని నేడు పార్లమెంట్ ఎన్నికలను అడ్డుపెట్టుకొని మరోసారి కొత్త డ్రామా ఆడుతున్నాడని సీఎం రేవంత్ రెడ్డిపై ఆరోపణలు చేశారు.పదేండ్ల పాలనలో బీఅర్ఎస్ ప్రభుత్వం గ్రామానికో లిక్కర్ పాలసీని తెచ్చారని పేర్కొన్నారు.దేశంలో పేద ప్రజలందనికి ఉచితంగా రేషన్ బియ్యాన్ని ప్రధాని నరేంద్ర మోడీ అందిస్తున్నారని చెప్పారు.రాష్ట్రంలో అమలయ్యే ప్రతీ పథకం కేంద్ర ప్రభుత్వం పథకాలే అని అమే తెలిపారు.కేంద్రంలో మరోసారి మోడీ ప్రభుత్వం అధికారంలోకి రావాలంటే ఇక్కడి భాజపా అభ్యర్థి సీతారాం నాయక్ గెలవాలని రాణి రద్రమారెడ్డి ప్రజలకు వివరించారు.ఎంపి అభ్యర్థి సీతారాం నాయక్ మాట్లాడుతూ గత 2014 ఎన్నికల్లో నర్సంపేట నుండి అత్యధిక మెజారిటీ వచ్చిందని అన్నారు.బీఅర్ఎస్ పార్టీ ఉద్యమకారులకు అన్యాయం చేసిందని ఈ నేపథ్యంలో భాజపా నన్ను గుర్తించి అవకాశం కల్పించిందన్నారు.ఈ జనసభలో మాజీ ఎంపీ గరికపాటి మోహన్ రావు, రాష్ట్ర క్రమశిక్షణ సంఘం చైర్మన్ మారుతినేని ధర్మారావు, వరంగల్ జిల్లా పార్టీ అధ్యక్షుడు గంట రవికుమార్, నూకల వెంకట నారాయణ రెడ్డి, ముసుకు శ్రీనివాస్ రెడ్డి, వల్లబు వెంకటేశ్వర్లు, సిరికొండ బలరాం, ఎలమంచిలి వెంకటేశ్వర్ రావు, కె.వి రంగా కిరణ్, ఎడ్ల అశోక్ రెడ్డి, రత్నం సతీష్ షా , సతీష్ బాబు, ఎర్రబెల్లి ప్రదీప్ రావు, పుల్లారావు యాదవ్, రాచకొండ కొమురయ్య, యాప సీతయ్య, డాక్టర్ గోగుల రాణా ప్రతాప్ రెడ్డి, డాక్టర్ కంభంపాటి పుల్లారావు, వడ్డేపల్లి నరసింహ రాములు కట్ల రామచందర్ రెడ్డి సింగారపు సతీష్ టి దేవేందర్ రావు రాజేష్ చందుపట్ల సత్యపాల్ రెడ్డి,పి నరోత్తం రెడ్డి, భాస్కర్ రెడ్డి, కృష్ణవేణి, రేసు శ్రీనివాస్, అజ్మీర శ్రీను, కూనమల్ల పృద్విరాజ్, రామబాబు, శీలం రాంబాబు గౌడ్, వీరన్న, మినుముల రాజు,సందీప్, మనీష్ గౌడ్ లతో పాటు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!