ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మోసపూరిత హామీలను అమలు చేయాలి
గుండాల(భద్రాద్రికొత్తగూడెం జిల్లా),నేటిధాత్రి:
ఆరు గ్యారంటీల పేరుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం పదహారు నెలలు గడిచినా ప్రజలను పట్టించుకోని కాంగ్రెస్ ప్రభుత్వ ముఖ్యమంత్రి,ఏనుముల రేవంత్ రెడ్డి,ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క లపై కేసు నమోదు చేయాలని బీఆర్ఎస్ పార్టీ గుండాల మండల అధ్యక్షులు డిమాండ్ చేస్తూ, గుండాల పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల రైతు సమన్వయ సమితి మాజీ అధ్యక్షులు మోకాళ్ళ వీరస్వామి, పార్టీ సీనియర్ నాయకులు గోగ్గెలా లక్ష్మీనారాయణ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.