MLA GSR Appeals to Elect Congress Councillors in Bhupalpally
కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లను గెలిపించాలి ఎమ్మెల్యే జిఎస్ఆర్
భూపాలపల్లి నేటిధాత్రి
భూపాలపల్లి మున్సిపల్ ఎన్నికల్లో అన్ని వార్డుల్లో సీపీఐ, సీపీఐ(యం)పార్టీలు బలపరిచిన కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థులకు ఓట్లేసి అత్యధిక మెజారిటీతో గెలిపించుకొని భూపాలపల్లి మున్సిపల్ పీఠంపై కాంగ్రెస్ జెండా ఎగరేయాలని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు అన్నారు సోమవారం భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని 18, 19, 30 వార్డులు ఎల్బీ నగర్, రెడ్డి కాలనీ, బానోత్ వీధి, సత్తార్ నగర్ కాలనీలల్లో సీపీఐ , సీపీఐ(యం)పార్టీలు బలపరిచిన కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థుల గెలుపు కొరకు ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు బట్టు కరుణాకర్, రాష్ట్ర ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ చైర్మన్ అయిత ప్రకాష్ రెడ్డి, సీపీఐ జిల్లా కార్యదర్శి కొరిమి రాజుకుమార్, సీపీఐ(యం) జిల్లా కార్యదర్శి బందు సాయిలు, పట్టణ అధ్యక్షుడు ఇస్లావత్ దేవన్, ముఖ్య నాయకులు మరియు ఆయా వార్డుల ఎన్నికల ఇంచార్జీ లతో కలిసి ఎన్నికల ప్రచారంను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా వార్డులల్లో నిర్వహించిన పబ్లిక్ కార్నర్ మీటింగ్ లలో ఎమ్మెల్యే మాట్లాడుతూ. భూపాలపల్లి మున్సిపల్ పీఠంపై కాంగ్రెస్ జెండా ఎగరాలని, అందుకు కాంగ్రెస్ శ్రేణులంతా సైనికుల్లా పనిచేయాలన్నారు. ప్రజా ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను ఆయుధాలుగా చేసుకుని ప్రతి ఇంటి గడపను తట్టాలన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత ప్రజా సంక్షేమం, అభివృద్ధి ప్రధాన లక్ష్యాలుగా పనిచేస్తోందని తెలిపారు. భూపాలపల్లి పట్టణ అభివృద్ధికి ఇప్పటికే చేపట్టిన పలు కార్యక్రమాలను కొనసాగిస్తూ, మున్సిపాలిటీని మరింత అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లేందుకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల గెలుపు అత్యంత అవసరమని అన్నారు. ప్రజలకు మెరుగైన తాగునీరు, రహదారులు, డ్రైనేజీ వ్యవస్థ, పారిశుధ్యం, పేదల సంక్షేమం వంటి అంశాలపై కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక దృష్టి సారిస్తుందని చెప్పారు. ప్రజలు కాంగ్రెస్ పార్టీని నమ్మి ఓటు వేసినట్లయితే భూపాలపల్లి మున్సిపాలిటీని రాష్ట్రంలోనే ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దుతామని ఎమ్మెల్యే అన్నారు. రాష్ట్రంలో మున్సిపాలిటీలను పూర్తిగా నిర్లక్ష్యం చేసిన పదేళ్లు పాలించిన వాళ్లకు మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలను ఓట్లు అడిగే నైతిక హక్కు లేదన్నారు. బీఆర్ఎస్ పాలనలో మున్సిపాలిటీలకు సరైన నిధులు కేటాయించకపోవడం, అభివృద్ధి పనులను పూర్తిగా విస్మరించడం జరిగిందన్నారు. ఎన్నికలు వస్తే హామీలు ఇవ్వడం, తర్వాత వాటిని గాలికి వదిలేయడం బీఆర్ఎస్కు అలవాటుగా మారిందన్నారు. ప్రజల సమస్యలను పట్టించుకోని పార్టీకి ఇప్పుడు ఓట్లు అడిగే హక్కు లేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పట్టణాల అభివృద్ధికి ప్రత్యేక దృష్టి సారించి, మున్సిపాలిటీలను బలోపేతం చేసే దిశగా చర్యలు తీసుకుంటుందని ఎమ్మెల్యే తెలిపారు. ప్రజలు బీఆర్ఎస్ మోసపూరిత రాజకీయాలను గుర్తించి, అభివృద్ధి సంక్షేమానికి కట్టుబడి ఉన్న కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వాలని కోరారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు
