కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి వీళ్ళ మధు నామినేషన్ కు….

– భారీగా తరలిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు….

– ప్రతి కార్యకర్త సైనికుల పని చేయాలి మల్లేశం గౌడ్…

కొల్చారం, (మెదక్ )నేటి ధాత్రి :-

మెదక్ కాంగ్రెస్ పార్లమెంట్ అభ్యర్థి నీలం మధు ముదిరాజ్ నామినేషన్ వేయనున్న సందర్భంగా మద్దతుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మెదక్ వస్తున్న నేపథ్యంలో కొల్చారం మండలం నుండి నర్సాపూర్ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి ఆవుల రాజిరెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు మల్లేశం గౌడ్ ఆధ్వర్యంలో కొల్చారం మండల వ్యాప్తంగా భారీ ఎత్తున కార్యకర్తలు పార్టీ శ్రేణులు ప్రజలు తరలి వెళ్లారు . ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు మల్లేశం గౌడ్ మాట్లాడుతూ నీలం మధు ముదిరాజ్ బీద కుటుంబంలో పుట్టి సర్పంచ్ నుండి పార్లమెంట్ అభ్యర్థిగా వెళ్తున్న సందర్భంగా మండల వ్యాప్తంగా నినాదాలతో బయలుదేరారు. వచ్చే ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్ చేతి గుర్తుకు ఓటు వేయాలని మల్లేశం గౌడ్ తెలిపారు. నర్సాపూర్ మాజీ ఎమ్మెల్యే మదన్ రెడ్డి కాంగ్రెస్ లో చేరినందున మరింత బలం పెరిగిందని , ఆవుల రాజి రెడ్డి గారి కృషి వల్ల పార్టీని మరింత బలోపేతం చేయగలరని తెలిపారు. ఈ కార్యక్రమంలో కొల్చారం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లేశం గౌడ్, ఉపాధ్యక్షులు గోవర్ధన్ , కార్యదర్శి మహేశ్వర్ రెడ్డి, సీనియర్ నాయకులు శేఖర్ చంద్రశేఖర్ రెడ్డి, ఏళ్లుగారి శ్రీనివాస్ రెడ్డి, గజినీ వెంకట్ గౌడ్ , గొ oడ కృష్ణ , చంద్రశేఖర్ రెడ్డి, దేవన్న గారి శేఖర్, రుప్లా నాయక్, పిఎసిఎస్ ఉపాధ్యక్షుడు లక్ష్మయ్య డైరెక్టర్ పండరి, వివిధ గ్రామాల మాజీ సర్పంచులు , మాజీ ఎంపీటీసీలు , కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *