కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి నరేందర్ రెడ్డి ని గెలిపించాలని జోరుగా ప్రచారం
వీణవంక,( కరీంనగర్ జిల్లా):నేటి ధాత్రి
వీణవంక మండల పరిధిలోని పోతిరెడ్డిపల్లి గ్రామంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో భాగంగా ఉమ్మడి కరీంనగర్, అదిలాబాద్, నిజామాబాద్, మెదక్ జిల్లాల కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఊట్కూరి నరేందర్ రెడ్డి నీ గెలిపించాలని హుజురాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి వొడితల ప్రణవ్ బాబు ఆదేశాల మేరకు మంగళవారం రోజున పోతిరెడ్డిపల్లి గ్రామంలో కాంగ్రెస్ నాయకులు ప్రచారం చేశారు.ఈ కార్యక్రమంలో పంజాల సతీష్ మాజీ సర్పంచ్ పానుగంటి మధుకర్ ,దుర్గం బిక్షపతి, చేపూరి రాజు, రాపర్తి కొండల్, రాపర్తి శ్రీనివాస్ ,రాపర్తి రవి తదితరులు పాల్గొన్నారు.