బిఆర్ఎస్ లో చేరిన కాంగ్రెస్ నాయకులు
జహీరాబాద్ నేటి ధాత్రి:
ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శాసనసభ్యులు కొనింటి మాణిక్ రావు గారి సమక్షంలో మాజి జహీరాబాద్ పట్టణ అధ్యక్షులు యాకూబ్ గారి ఆధ్వర్యంలో జహీరాబాద్ పట్టణం అల్లీపూర్ లోని ఫయాజ్ నగర్ కాలనీకి చెందిన షేక్ ఇస్మాయిల్ మరియు వారి బృందం కాంగ్రెస్ పార్టీ లో నుండి బిఆర్ఎస్ పార్టీ లో చేరడం జరిగింది ఈ సంధర్బంగా ఎమ్మెల్యే మాణిక్ రావు వారికి గులాబి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ మోసపూరిత హామీలతో ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్ పార్టీని ప్రజలు భవిష్యత్తులో తగిన బుద్ధి చెప్తారని,మైనార్టీ లకు మంత్రివర్గం లో చోటు కల్పించకపోవడం మైనారిటీల పట్ల కాంగ్రెస్ పార్టీకి ఉన్న చిత్తశుద్ధి ఎంటో అర్థమైంది అని,రాబోయే ప్రభుత్వం బిఆర్ఎస్ దే అని,రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి చేస్తాం అని అన్నారు .ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు నామ రవికిరణ్,ఇబ్రహీం,మొహమ్మద్ అలి,ఆల్లిపూర్ నాయకులు శంకర్ పటేల్,దీపక్,మోహన్,ప్రవీణ్ మెస్సీ , తదితరులు పాల్గొన్నారు..