ఎంపీ బండి సంజయ్ పై పిర్యాదు చేసిన కాంగ్రెస్ నాయకులు

వేములవాడ రూరల్ నేటిధాత్రి

రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడరూరల్ పోలీస్ స్టేషన్లో ఎంపీ బండి సంజయ్పై మండల కాంగ్రెస్ నాయకులు మంగళవారం ఫిర్యాదు చేశారు. బండి సంజయ్పై చర్యలు తీసుకోవాలని కోరుతూ వేములవాడ రూరల్ ఎస్ఐ మారుతికి కాంగ్రెస్ నాయకులు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ సందర్భంగా వేములవాడ రూరల్ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు వకుళాభరణం శ్రీనివాస్ మాట్లాడుతూ రాష్ర్ట రవాణా శాఖ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్పై, అతని మాతృమూర్తిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన పార్లమెంట్ సభ్యుడు బండి సంజయ్ మంత్రి కుటుంబానికి, మంత్రివర్యులకు క్షమాపణ చెప్పాలని భేషరతుగా కోరుతున్నామన్నారు. మతాలు, కులాలు రెచ్చగొట్టే నీవు కాంగ్రెస్ పార్టీని కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తే ఊరుకోమని, నీకు మతి భ్రమించిందన్నారు. పిచ్చి మాటలు మాట్లాడుతున్నావనే నిన్ను అధ్యక్ష పదవి నుండి తీసివేశారన్నారు. క్షమాపణ చెప్పకపోతే రాబోయే రోజుల్లో తల్లులంతా గుణపాఠం చెబుతారన్నారు. కులాలకు, మతాలకు తావు లేకుండా అందరిని కాంగ్రెస్ పార్టీ సమానంగా చూస్తూ పాలిస్తుందన్నారు. నీవు కుల, మతాలను రెచ్చగొడుతూ ఓట్ల రాజకీయం చేస్తావన్నారు. పొన్నం ప్రభాకర్ శివభక్తుడు, రామ భక్తుడు, ఆయన వేములవాడ రాజన్న ఆలయాన్ని చాలా సార్లు దర్శించుకున్నారు. నీవు ఎన్నిసార్లు రాజన్న ఆలయానికి వచ్చావో చెప్పాలన్నారు. మాతృమూర్తులకు క్షమాపణ చెప్పి ప్రాంతంలో అడుగు పెట్టాలని, లేనిచో గుణపాఠం చెప్పడానికి మహిళలు సిద్దంగా ఉన్నారన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ రంగు వెంకటేష్, నాయకులు చిలుక ప్రభాకర్, బత్తిని ఎల్లగౌడ్, జాగిరి సురేష్, వేణు, శ్రీకాంత్ తదితరులు ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!