మృతుని కుటుంబాన్ని పరామర్శించిన కాంగ్రెస్ నాయకులు.
నల్లబెల్లి, నేటి ధాత్రి:
రుద్రగూడెం గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు నాన బోయిన రాజయ్య అనారోగ్యంతో మృతిచెందగా విషయం తెలుసుకున్న మండల కాంగ్రెస్ నాయకులు మృతుని స్వగృహానికి చేరుకొని ఆయన పార్టీవ దేహం పై పూలమాలవేసి ఘన నివాళులర్పించారు అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి తమ ప్రగాఢ సానుభూతిని తెలిపారు. పరామర్శించిన వారిలో మాజీ మండల వర్కింగ్ ప్రెసిడెంట్ మాలోత్ చరణ్ సింగ్, నాయకులు బత్తిని మహేష్ యాదవ్, అజ్మీర తిరుపతి, మామిండ్ల రాజిరెడ్డి, మాజీ ఉపసర్పంచ్ బై కానీ కోటి, మాసం పెళ్లి అఖిల్, గంధం చోటు తదితరులు ఉన్నారు.
