భద్రాచలం నేటి ధాత్రి
ఈరోజు భద్రాచలం ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు ఆదేశాల మేరకు చర్ల రోడ్ నన్నపనేని స్కూల్ నందు పునరావస కేంద్రాన్ని పర్యవేక్షించిన భద్రాచలం మండల కాంగ్రెస్ నాయకులు.
ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు ఫోన్ ద్వారా నిర్వాసితులతో మాట్లాడినారు.
భోజనం, వైద్య సదుపాయాలు అందుబాటులో ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు.
అధికారులతో మాట్లాడి అన్ని సదుపాయాలు అందుబాటులో ఉండే విధంగా చూడాలని ఆదేశించారు
ఈ కార్యక్రమంలో మండల నాయకులు రత్నం రమాకాంత్, బొంబోతుల రాజీవ్, నర్రా రాము, ఆకుల వెంకట్, పుల్లగిరి నాగేంద్ర, బత్తుల శ్రీను, ఒగ్గే రమణ తదితరులు పాల్గొన్నారు