దయ్యాలు వేదాలు వల్లించినట్టు కేటీఆర్ మాటలు ఉన్నాయి కాంగ్రెస్ నాయకుల

మల్కాజిగిరి (నేటి ధాత్రి)

ఆనంద్ భాగ్ మాజీ ఎమ్మెల్యే మైనం పల్లి హన్మంత రావు క్యాంపు కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఏర్పాటు చేయడం జరిగింది ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ మంచికి డబ్బుకు జరిగిన పోటీలో డబ్బు ప్రలోభం గెలిచింది. అలా అని మంచి చేసిన వ్యక్తిని ఎవరూ మర్చిపోరు. మల్కాజిగిరిలో ఈరోజు ఉన్న పరిస్థితి ఏ విధంగా ఉందో మీ అందరికీ తెలుసు. బిఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో కేటీఆర్ అధికారంలోకి రాలేక పిచ్చి పట్టినట్టుగా ప్రవర్తిస్తున్నారు. వారి మాటలు దయ్యాలు వేదాలు వల్లించడం అంటే ఇదే అన్న తీరుగా ఉన్నాయి. ఉద్యమకారుల తో సాధించిన తెలంగాణ నేనే సాధించానని గొప్పలు చెప్పుకోవడం వారి పేరుపై గద్దెనెక్కడం తప్ప మీరు చేసింది ఏమీ లేదు. వందల ఎకరాలు ఉన్న వారిని రైతు అనరు భూస్వామి అంటారు. రెండెకరాల్లో ఉన్నవారికి రైతుబంధు వేసాము.ముఖ్యంగా మైనంపల్లి గురించి మాట్లాడే స్థాయి నీది కాదు. ముందు మీ పార్టీలో ఆయన ఏ స్థాయిలో ఉన్నారు. గ్రేటర్ హైదరాబాద్ ని ముందుండి నడిపించింది ఎవరు నీకు తెలియదా కేటీఆర్. మల్కాజ్గిరి లో అభివృద్ధి చేసింది ఎవరంటే మైనంపల్లి అని ప్రతి ఒక్క వ్యక్తి చెప్తారు. అలాంటి వ్యక్తిపై అబండాలు వేస్తే ఊరుకునే ప్రసక్తి లేదని ఖబర్దార్ కేటీఆర్ అని హెచ్చరించారు.
డబ్బులకు అమ్ముడుపోయిన కార్పొరేటర్లతో కరప్షన్ చేయిస్తూ డబ్బులు దండుకుంటున్నాది మీరు. అక్రమాలను p చూపుతున్నది ప్రజలే, వాటిని మైనంపల్లి పై రుద్దవొద్దని అన్నారు, ఈ కార్యక్రమం లో ఏ బ్లాక్ అధ్యక్షుడు అశోక్ రెడ్డి, బి బ్లాక్ అధ్యక్షుడు వెంకటేష్ యాదవ్,బి కే శ్రీనివాస్,చంద్ర శేఖర్,Gnvసతిష్ కుమార్,పిట్ల శ్రీనివాస్,డివిజన్ అధ్యక్షులు G D సంపత్ గౌడ్, వైనాల ప్రవీణ్,వినోద్ యాదవ్,సనాది శంకర్,కొండ గౌడ్,నరేందర్ గౌడ్,యూత్ అధ్యక్షుడు చరణ్ జిత్ గౌడ్,బాల రాజ్ యాదవ్,సంతోష్ రాందాస్,సంజయ్,అశోక్ కుమార్,సాయి బాబా, తదితరులు పాల్గొన్నారు,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *