ముత్తారం :- నేటి ధాత్రి
ఐటీ,భారీ పరిశ్రమలు, అసెంబ్లీ వ్యవహరాల శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు జన్మదిన వేడుకలను కాంగ్రెస్ నాయకులు ఘనంగా జరుపుకున్నారు ముత్తారం మండల కేంద్రంలోని హనుమాన్ గుడిలో ప్రత్యేక పూజా కార్యక్రమం నిర్వహించారు అనంతరం ప్రభుత్వ ఆస్పత్రిలో పేషెంట్ లకు పండ్లు పంపిణీ కార్యక్రమం జరిగింది.. అనంతరం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా సంబురాల చేసుకుంటూ కేక్ కటింగ్ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు దొడ్డ బాలాజీ మాజీ జడ్పీటీసీ చొప్పరి సధానందం మాజీ జడ్పీటీసీ జగన్ మోహన్ రావు ముత్తారం మండల నాయకులు, కార్యకర్తలు, మహిళా నాయకురాళ్లు తదితరులు పాల్గొన్నారు..