పేదప్రజలను ఇండ్ల పేరిట దోచుకుంటున్న కాంగ్రెస్ నాయకులు
పరకాల నేటిధాత్రి:
మండలంలోని వెంకటాపురం గ్రామంలో ఇందిరమ్మ ఇండ్లు అర్హతకలిగిన లబ్ధిదారులకు చెందకుండా నిరుపేదలను మోసం చేస్తున్నారని వారి పార్టీ కార్యకర్తలకు మరియు కమిటీ సభ్యులకు మాత్రమే ఇల్లు కేటాయించుకోవడం జరుగుతుందని గ్రామంలో ఇల్లు కావాలనే వారి దగ్గర 30 వేల నుండి 50 వేల వరకు డబ్బులు తీసుకుని ఇందిరమ్మ ఇళ్లకు అర్హులైన వారి పేర్లు లేకుండా చేసి అనర్హుల పేర్లను పెడుతున్నారని కాంగ్రెస్ నాయకులు వాళ్లు ఇష్టానుసారం చేస్తున్నారన్నారని భారతీయ జనతా పార్టీ పరకాల రూరల్ మండలం మాజీ అధ్యక్షులు ముష్కే దేవేందర్ అన్నారు.పేదప్రజలను రాబోయే స్థానిక ఎలక్షన్లో కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తుగా ఓడిపోతుందని హెచ్చరించారు.ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం బుద్ధి తెచ్చుకొని అర్హులైన వారికి పథకాలు అందేలా చూడాలని కోరారు.