* కాంగ్రెస్ అంటేనే పేదల ప్రభుత్వం…………..
భూపాలపల్లి జిల్లా యూత్ కాంగ్రెస్ నాయకుడు* –
అజయ్ రెడ్డి యార నేటి ధాత్రి మొగుళ్ళపల్లి
తెలంగాణ రాష్ట్ర ప్రజా ప్రభుత్వం(కాంగ్రెస్ ప్రభుత్వం) రైతుకు న్యాయం జరగాలి అని 2 లక్షల రూపాయలు ఏక కాలంలో రుణ మాఫీ చేసి రైతు భరోసాను పది వేల నుండి పన్నెండు వేల రూపాయలకు పెంచి చిన్న సన్న కారు రైతులకు ఎంతో మేలు జరిగేలా చేస్తుంది.
అంతే కాకుండా నిరు పేద కుటుంబాలకు ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేసి ఐదు లక్షల రూపాయలు అందజేయడం జరుగుతుంది మరియు విద్యార్థులకు డైట్ ఛార్జీలు పెంచి ఆరోగ్యకరమైన ఆహారాన్ని అందిస్తుంది.
రాష్ట్రంలో 200 యూనిట్ల వరకు ఉచిత కరెంటు గృహ అవసరాలకు ఇవ్వడం జరుగుతుంది మరియు మహిళలకు ఉచిత బస్ సౌకర్యం, రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం 10 లక్షల రూపాయలకు పెంచి కార్పోరేట్ హాస్పటల్ లో పేద ప్రజలు చికిత్స పొందేలా చేయడం జరుగుతుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చదువుకున్న విద్యార్థులకు 50 వేల ఉద్యోగ నియామకాలు చేపట్టి నియామక పత్రాలు అందజేశారు. అంతే కాకుండా నిరుద్యోగులకు 4 లక్షల వరకు 60 శాతం సబ్సిడీతో రుణాలు అందించాలని దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా కుల గణన చేపట్టి బీసీ లకు 42 శాతం రిజర్వేషన్ కల్పించాలని అసెంబ్లీలో బిల్లును ప్రవేశపెట్టారు. రానున్న రోజుల్లో రాష్ట్ర ప్రజలకు మరెన్నో ప్రయోజనాలు అందించాలని, నిత్యం ప్రజల ప్రయోజనాల కోసం మరియు రాష్ట్ర అభివృద్ధి కోసం పాటు పడతాం అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు హామీ ఇచ్చారు. ఇందుకు గాను భూపాలపల్లి జిల్లా యూత్ కాంగ్రెస్ నాయకుడు యార అజయ్ రెడ్డి గారు మాట్లాడుతూ ప్రజా ప్రభుత్వం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలిపారు.