ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు
జైపూర్,నేటి ధాత్రి:
జైపూర్ మండలం టేకుమట్ల గ్రామంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి,పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ ఆదేశాల మేరకు శనివారం ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రారంభించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం రైతు సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇస్తుందని అన్నారు.రైతులు పండించిన ప్రతి ధాన్యం గింజను కొనుగోలు చేస్తామని,ఏ సమస్య ఉన్న తమ దృష్టికి తీసుకురావాలని తెలిపారు. దేశంలో ఎక్కడా లేని విధంగా మన రాష్ట్రంలో వరి పంట ఎక్కువ దిగుబడి అవుతుందని అన్నారు. రూ.2లక్షల రుణమాఫీ చేసి రైతు పక్ష పాతిగా కాంగ్రెస్ ప్రభుత్వం నిలిచిందని తెలిపారు.సన్న వడ్ల ధాన్యానికి 500 రూపాయల బోనస్ ఇస్తున్న ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికె దక్కిందని అన్నారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు చల్ల సత్యనారాయణ రెడ్డి, పిఎసిఎస్ చైర్మన్ గుండు తిరుపతి,వైస్ చైర్మన్ చంద్రశేఖర్ రెడ్డి,మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు,గ్రామ రైతులు, సెంటర్ ఇన్చార్జి బల్ల రమేష్ తదితరులు పాల్గొన్నారు.