కాంగ్రెస్ ప్రభుత్వం పేదల ప్రభుత్వం!!

నూతన గ్రామ పంచాయతీ కార్యాలయం ప్రారంభోత్సవం చేసిన ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్
జగిత్యాల నేటి ధాత్రి


బుగ్గారం మండలం మద్ధునూర్, యశ్వంతరావు పేట గ్రామాలకు చెందిన నూతన గ్రామ పంచాయతీ కార్యాలయాన్ని శుక్రవారం రోజున ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ప్రారంభించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..గ్రామ పంచాయతీ కార్యాలయ ప్రారంభోత్సావ కార్యక్రమంలో నన్ను భాగస్వాములను చేసినందుకు చాలా సంతోషంగా ఉందని,కాంగ్రెస్ ప్రభుత్వం పేదల ప్రభుత్వమని, అర్హులైన ప్రతి పేదవారికి ప్రభుత్వ ఫలాలు అందేలా చూస్తామని,రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం ఆరు గ్యారెంటీలలో భాగంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం,ఆరోగ్య శ్రీ పరిధి పెంపు వంటి హామీలను అమలు చేయడం జరిగిందని,బుగ్గారం మండలానికి సంబందించిన ప్రతి సమస్యను పరిష్కరిస్తామని,
కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ప్రతి హామీకి కట్టుబడి ఉందని ఈ సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సుభాష్,ఉపాధ్యక్షులు నర్సగౌడ్,మద్ధునూర్ సర్పంచ్ తిరుపతి, యశ్వంతరావు పేట సర్పంచ్ రాజు, వార్డు సభ్యులు అంజిత్,విజయ్ మండల నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *