కాంగ్రెస్ ప్రభుత్వం.. పేదల ప్రభుత్వం.
రేషన్ కార్డు లేక.. బడుగు బలహీన వర్గాలు దూరం
511 కొత్త రేషన్ కార్డులు పంపిణీ.
ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి.
మహబూబ్ నగర్/ నేటి ధాత్రి
ప్రజా సంక్షేమానికి కట్టుబడి ఉన్నామని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు. మహబూబ్ నగర్ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మహబూబ్ నగర్ గ్రామీణ మండలానికి చెందిన 511 మంది లబ్దిదారులకు నూతన రేషన్ కార్డులను ఆయన పంపిణీ చేశారు. అనంతరం ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గత పది సంవత్సరాలుగా ఒక్క లబ్దిదారుడికి కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం రేషన్ కార్డు ఇవ్వలేదని, రేషన్ కార్డులు ఇవ్వకపోవడం వల్ల బడుగు బలహీన వర్గాల ప్రజలకు తీరని నష్టం జరిగిందని ఆయన ఆరోపించారు. రేషన్ కార్డు లేకపోవడం వలన ప్రభుత్వ సంక్షేమ పథకాలు వారికి అందలేదని, రాజీవ్ ఆరోగ్యశ్రీ లాంటి పథకాలు పేద ప్రజలు వినియోగించుకోలేక పోయారని అందువల్ల వారు ఆర్థికంగా కూడా చాలా నష్టపోయారని ఎమ్మెల్యే మండిపడ్డారు. ప్రజా ప్రభుత్వం లో సీఎం రేవంత్ రెడ్డి సారధ్యంలో అధికారంలోకి రాగానే.. పేద బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి కృషి చేస్తున్నారని ఆయన గుర్తు చేశారు. విద్య, వైద్యం, ఉపాధి పైన అధిక శ్రద్ధ చూపిస్తూ.. అన్ని వర్గాల ప్రజల సంక్షేమ పథకాలు అందిస్తున్నాం అని అన్నారు. గత 75 సంవత్సరాల కాలంలో ఎన్నడూ సాధ్యం కానిది ప్రజా ప్రభుత్వంలో రేషన్ షాపుల్లో సన్న బియ్యం పంపిణీ చేస్తున్నామని, తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి ఉచితంగా 6 కేజీల సన్న బియ్యం పంపిణీ చేస్తున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. రైతుల వద్ద సేకరించిన సన్న వడ్లను బియ్యంగా మార్చి తిరిగి ప్రజలకే పంచడం నిజంగా విప్లవాత్మక నిర్ణయం ఎమ్మెల్యే అన్నారు. రేషన్ షాపుల్లో సన్న బియ్యాన్ని అందరూ తప్పకుండా వాడుకోవాలని ఆయన సూచించారు. మీ బాగుకోసం పనిచేసే కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లు నర్సింహ్మారెడ్డి, ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్, డిసిసి ప్రధాన కార్యదర్శి సిరాజ్ ఖాద్రీ, ఐఎన్టీయుసి రాములు యాదవ్, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ షబ్బీర్ అహ్మద్, మత్స్యకారుల సంఘం అధ్యక్షులు గంజి ఆంజనేయులు, అవేజ్, మాజీ మున్సిపల్ కౌన్సిలర్స్ ఖాజా పాషా, చిన్న , మోసిన్ , నాయకులు శ్రీనివాస్ యాదవ్, అర్షద్ అలి, కిషన్ నాయక్, గోవింద్ యాదవ్, ధర్మాపూర్ నర్సింహారెడ్డి, పోతన్ పల్లి మోహన్ రెడ్డి, గోపాల్, చర్ల శ్రీనివాసులు, అజిజ్ అహ్మద్, తులసిరాం నాయక్, మన్యం కొండ నరేందర్ రెడ్డి, , తహసీల్దార్ సుందర్ రాజ్, ఎంపిడిఓ కరుణశ్రీ, తదితరులు పాల్గొన్నారు.