సన్నబియ్యం అందించడమే లక్ష్యంగా కాంగ్రెస్.

Congress Congress

సన్నబియ్యం అందించడమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం

పీసీసీ సభ్యులు పెండెం రామానంద్
23వ వార్డులో సన్నబియ్యం పంపిణీ మొదలు

నర్సంపేట,నేటిధాత్రి:

 

 

రేషన్ కార్డు కలిగిన ప్రతి ఒక్కరికి సన్న బియ్యం అందించడమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం పని చేస్తోందన్నదని
టీపీసీసీ సభ్యులు పెండెం రామానంద్ తెలిపారు.రేవంత్ రెడ్డి సర్కార్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సన్న బియ్యం పంపిణి కార్యక్రమాన్ని నర్సంపేట పట్టణంలోని 23 వ వార్డులో టీపీసీసీ సభ్యులు పెండెం రామానంద్ ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
ఈ కార్యక్రమంలో ఓబీసీ వరంగల్ జిల్లా అధ్యక్షులు ఓర్సు తిరుపతి, నర్సంపేట పట్టణ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి వార్డు ఇంచార్జ్ మాదాసి రవి కుమార్, వార్డు అధ్యక్షులు పెద్దపెల్లి శ్రీనివాస్, 16వ వార్డ్ ఇంచార్జ్ భాణాల శ్రీనివాస్ బైరగొని రవి, మాజీ వార్డు సభ్యులు గండి గిరి, కోమటి సరోజన, సంగెపు తేజ, పెద్దపెల్లి కేదారి, వేముల జంపయ్య, సృజన, ప్రభుదాస్, రాజు, తదితరులు పాల్గొన్నారు.

21,22 వ వార్డులలో సన్నబియ్యం పంపిణీ..

Congress
Congress

 

ఆరు గ్యారంటీల్లో నాలుగు అమలు చేసిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం

మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ మాజీ ఫ్లోర్ లీడర్ వేముల సాంబయ్య గౌడ్

నర్సంపేట పట్టణంలోని 21, 22,వ డివిజన్లో 8 నెంబర్ రేషన్ షాప్ వద్ద సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని నర్సంపేట మున్సిపాలిటీ మాజీ ఫ్లోర్ లీడర్ వేముల సాంబయ్య గౌడ్ ప్రారంభించారు.ఈ సందర్భంగా వేముల సాంబయ్య గౌడ్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు 6 గ్యారంటీల్లో భాగంగా అర్హులైన ప్రతి కుటుంబానికి సన్న బియ్యం పంపిణీ చేస్తున్నదని పేర్కొన్నారు.ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన ప్రకారం తెలంగాణ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో గతంలో 500 కే గ్యాస్, ఉచిత విద్యుత్తు, మహిళలకు ఉచిత బస్సు సౌకర్యంతో పాటు నేడు సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాలను కూడా విజయవంతంగా అమలు చేస్తుందని చెప్పారు.నర్సంపేట నియోజకవర్గంలో శాసనసభ్యులు దొంతి మాధవరెడ్డి నాయకత్వంలో ప్రజలకు రేషన్ బియ్యం పంపిణీ కార్యక్రమాలు కొనసాగుతున్నాయని ప్రజలు సద్వినియోగం చేసుకొని ప్రభుత్వ పథకాలు దుర్వినియోగం కాకుండా భాగస్వాములై చూడాలని అన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ ఉపాధ్యక్షులు వేముల సారంగం గౌడ్, బాణాల శ్రీనివాసు, దండెం రతన్ కుమార్, ఎన్ ఎస్ యు ఐ పట్టణ అధ్యక్షులు కటారి ఉత్తమ్ కుమార్, పట్టా యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు సాయి పటేల్, 22వ డివిజన్ మైనార్టీ నాయకులు ఎండి వాజిద్, స్వచ్ఛంద సంస్థల నాయకులు బెజ్జంకి ప్రభాకర్, డీలర్ శశిరేఖ చంద్రమౌళి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!