భద్రాచలం నేటి ధాత్రి
పోరిక బలరాం నాయక్ విజయాన్ని కాంక్షిస్తూ ముమ్మర ప్రచార నిర్వహిస్తున్న మాజీ గ్రంధాల చైర్మన్ భోగల శ్రీనివాసరెడ్డి
ఈరోజు మాజీ గ్రంధాల చైర్మన్ భోగాల శ్రీనివాస్ రెడ్డి మహబూబాబాద్ పార్లమెంట్ అభ్యర్థి పోరిక బలరాం నాయక్ విజయాన్ని కాంక్షిస్తూ భద్రాచల నియోజకవర్గంలో ప్రచారణ నిర్వహిస్తున్నారు.
ప్రచారంలో భాగంగా ఆయన ప్రజలతో మాట్లాడుతూ
రాబోవు పార్లమెంటు ఎన్నికల్లో మహబూబాబాద్ పార్లమెంట్ గడ్డపై కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరటం ఖాయమని, గతంలో ఉన్నటువంటి పాలకుల అసమర్థత వల్ల అభివృద్ధి కుంటుపడిందని, నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయగల సమర్థుడు బలరాం నాయక్ గారెనని ప్రజలు నేను గెలిపించేందుకు దృఢ సంకల్పంతో ఉన్నారని ఆయన మాట్లాడారు
ఈ ఎన్నికల ప్రచారంలో ఎస్సీ సెల్ పట్టణ అధ్యక్షులు రాసి మల్ల రాము, కాంగ్రెస్ నాయకులు అన్నేం రామిరెడ్డి, మహిళ కాంగ్రెస్ నాయకులు తుమ్మల రాణి మహిళా కాంగ్రెస్ కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.