Congress Boosts Door-to-Door Campaign
జోరుగా సాగిన కాంగ్రెస్ ఇంటింటి ప్రచారం
కాంగ్రెస్ కు ఓటు వేస్తే… అభివృద్ధికి ఓటేసినట్లే
అభివృద్ధి ఒక్క కాంగ్రెస్కే సాధ్యం
ఎమ్మెల్యే మురళి నాయక్ ప్రత్యేక చొరవతో అభివృద్ధి పనులు
కాంగ్రెస్ విస్తృత ఇంటింటి ప్రచారంలో పాల్గొన్న డిసిసి ఉపాధ్యక్షులు అంబటి మహేందర్ రెడ్డి
కేసముద్రం/ నేటి ధాత్రి
ఎన్నికల నియమ నిబంధన ప్రకారం చివరి రోజు పార్టీల ప్రచారం జోరుగా సాగింది. కేసముద్రం మండలంలోని సప్పిడి గుట్ట గ్రామపంచాయతీ పరిధిలోని మరియు భూక్యరాం తండా గ్రామపంచాయతీ గ్రామాలలో చివరి రోజు ప్రచారం జోరుగా సాగింది ఈ ప్రచార కార్యక్రమంలో డిసిసి ఉపాధ్యక్షులు అంబటి మహేందర్ రెడ్డి పాల్గొని కాంగ్రెస్ ఇంటింటి ప్రచారంలో ప్రతి గడపగడపకు , ప్రతి చేను తిరుగుతూ సప్పిడి గుట్ట తండా గ్రామపంచాయతీ పరిధిలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి బానోత్ బద్రు నాయక్ వెన్నంటే ఉండి. మరియు భూక్య రామ్ తండా సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న జాటోత్ సోమి కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తున్న ఈ అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను అభ్యర్థిస్తూ ప్రచారం చేయడం జరిగింది. అనంతరం మహేందర్ రెడ్డి మాట్లాడుతూ సప్పడిగుట్ట తండా పంచాయతీ లో ఎమ్మెల్యే మురళి నాయక్ ప్రత్యేక చొరవతో అనేక నిధులు కేటాయించి అభివృద్ధి పనులు చేయడం జరిగిందని ఇక ముందు కూడా అభివృద్ధి ఇదేవిధంగా జరుగుతుందని వివరిస్తూ సప్పిడి గుట్ట తండా పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ నుండి పోటీ చేస్తున్న బానోత్ బద్రు నాయక్ ను అత్యధిక మెజార్టీతో గెలిపించుకొని ఇంకా మరిన్ని అభివృద్ధి పనుల ఫలాలు అందిపుచ్చుకోవాలని ఓటర్లను అభ్యర్థిస్తూ అభివృద్ధి ఒక కాంగ్రెస్ పార్టీకే సాధ్యమవుతుందని అందుకు ఈ గ్రామపంచాయతీ పరిధిలో జరిగిన అభివృద్ధి పనులనే నిదర్శనంగా తీసుకోవాలని గతంలో ఏ పార్టీ చేయని విధంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట ప్రకారం లక్షల రూపాయల నిధులు కేటాయిస్తూ అభివృద్ధి చేసిందని ఇకముందు అభివృద్ధి ఇదేవిధంగా జరుగుతుందని తండాలోని ప్రజలు అభివృద్ధికి పట్టం కట్టి కాంగ్రెస్ పార్టీ నుండి పోటీ చేస్తున్న అభ్యర్థులను అత్యధికంగా ఓట్ల మెజారిటీతో గెలిపించాలని తండా ప్రజలను కోరారు.
