మహబూబాబాద్ పార్లమెంట్ ఎన్నికల్లో గెలిచేది కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పోరిక బలరాం నాయక్

భద్రాచలం నేటి ధాత్రి

పదేళ్లు ఎంపీలుగా ఉన్న ఇద్దరూ నియోజకవర్గానికి తగ్గడు మట్టి కూడా తేలేకపోయారు,ఎన్నికల్లో వారి ఇద్దరికీ గోరపరాభావం తప్పదు.

పదేళ్లు నియోజకవర్గనీ అభివృద్ధి చేయకుండా మాయమాటలకు మోసపోయిన ప్రజలు, అభివృద్ధి చేయగల సత్త ఉన్న నాయకుడు బలరాం నాయక్ కె పట్టం కడతారు.

మాజీ గ్రంథాలయ చైర్మన్ భోగాల శ్రీనివాస్ రెడ్డి

పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈరోజు భద్రాచలం పట్టణం పురవీధుల్లో కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థి కోరిక బలరాం నాయక్ విజయాన్ని కోరుతూ మాజీ గ్రంథాలయ చైర్మన్ భోగాల శ్రీనివాస్ రెడ్డి నేతృత్వంలో ఇంటింటి ప్రచారం నిర్వహించడం జరిగింది.

ఈ ప్రచారంలో టీజేఏసీ నాయకులు, ఎన్.ఎస్.యు.ఐ నాయకులు పాల్గొని జోరుగా ఎన్నికల ప్రచారం నిర్వహించడం జరిగింది.

ప్రచారంలో భాగంగా బోగాల శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ హామీలను వివరిస్తూ ఎన్నికల ప్రచారం ఈ విధంగా నిర్వహించారు.
కాంగ్రెస్ పార్టీ ప్రజలకు హామీ ఇస్తే ఆ హామీని నెరవేర్చి తీరుతుందని,గత తెలంగాణ పాలకులు ఎన్నో బూటకపు హామీలు ఇచ్చి తెలంగాణ రాష్ట్రాన్ని ఆగం చేశారని, బూటకపు హామీల్లో భాగంగా భద్రాచలం నియోజకవర్గం ప్రజలకు అనేక మాయ మాటలతో,అబద్ధపు హామీలతో ఇక్కడ ప్రజలను పచ్చిగా మోసం చేశారని.

పదేళ్ల కాలంలో ఇక్కడి ప్రాంతానికి ఎంపీలుగా ప్రాతినిధ్యం వహించిన ఇద్దరు సీతారాం నాయక్, మాలోత్ కవిత ఈ ప్రాంత అభివృద్ధి గురించి ఆలోచన చేయలేకపోగా, కెసిఆర్ ఇచ్చిన అబద్ధపు హామీలకు ఆయన భజన చేస్తూ కాలాన్ని వెళ్లబుచ్చి భద్రాచలం నియోజకవర్గనీ అభివృద్ధికి నోచుకోకుండా చేశారు, అలాంటి చేతగాని నాయకులు మహబూబాబాద్ నియోజకవర్గ ప్రజలకు అవసరం లేదని ఆయన అన్నారు.

అభివృద్ధికి కేంద్ర బిందువు అయినటువంటి మాజీ కేంద్ర మంత్రివర్యులు బలరాం నాయక్ భద్రాచల నియోజకవర్గానికి చేసిన అభివృద్ధి పనులు ప్రజలకు గుర్తున్నాయని, ఆయన కేంద్ర మంత్రిగా ఉన్న టైంలోనే భద్రాచలం నియోజకవర్గం లో అభివృద్ధి అనేది పరుగులు పెట్టిందని, మరలా ఇప్పుడు ఎంపీ అభ్యర్థిగా బలరాం నాయక్ గెలుపుతోనే నియోజకవర్గం అభివృద్ధి బాట పడుతుందని ప్రజలందరూ కోరుకుంటున్నారని ఆయన అన్నారు.

ఈనెల 13వ తారీకు జరగబోవు పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పోరిక బలరాం నాయక్ ఎన్నికల గుర్తు హస్తం. ఈవీఎం బాక్స్ నందు నాలుగో నెంబర్ లో ఉన్న హస్తం గుర్తుపై ఓటు వేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పోరిక బలరామయ్య ని అఖండ మెజారిటీతో ప్రజలు గెలిపించాలని ఆయన కోరూతు ఎన్నికల ప్రచారం నిర్వహించారు.

ఈ ఎన్నికల ప్రచారంలో.

TJAC నాయకులు తిప్పన సిద్దులు , తాండ్ర నరసింహారావు, ఎస్సీ సెల్ పట్టణ అధ్యక్షులు రాస మల్ల రాము, ఎన్.ఎస్.యు.ఐ నియోజకవర్గ అధ్యక్షులు సరెళ్ళ వెంకటేష్, షాబీర్ పాషా, అన్నేం రామిరెడ్డి,మహిళా కాంగ్రెస్ నాయకులు తుమ్మల రాణి,కట్టా కళ్యాణి,పద్మప్రియ,రూపా దేవి, టీజేఏసీ, ఏన్.ఎస్.యు.ఐ నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!