ఎండపల్లి (జగిత్యాల) నేటిదాత్రి
ఎండపల్లి మండలంలోని గుల్లకోట జడ్.పి.హెచ్.ఎస్ పాఠశాలకు చెందిన విద్యార్థులు జే.అక్షయ,వి శరణ్య,బి హర్షిత్, సిహెచ్.సంజయ్ లు ఇటీవల మంచిర్యాల జిల్లాలో భీమరంలో జరిగినటువంటి 67వ ఎస్ జి ఎఫ్ రాష్ట్రస్థాయి పోటీలలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా జట్టుకు ప్రాతినిధ్యం వహించి జట్ల విజయానికి తోడ్పడ్డారు బాలుర జట్టు ద్వితీయ స్థానం,బాలికల జట్టు తృతీయ స్థానం సాధించాయి. ఈ జట్టుకు ప్రాతినిధ్యం వహించిన పాఠశాల విద్యార్థులను పాఠశాల ప్రధానోపాధ్యాయుడు జి.రామచంద్రం, పిఈటీ మహేష్, ఉపాధ్యాయ బృందం మరియు గ్రామ సర్పంచ్ స్వరూప తిరుపతి,ఉపసర్పంచ్ శ్రీను, ఎంపీటీసీ శ్రీజ మల్లేశం, సీనియర్ క్రీడాకారులు మహేష్, సాయి, మౌనిక, జీవన్,రాహుల్ మరియు గ్రామస్థులు, ప్రజా ప్రతినిధులు అభినందించారు
ఎస్ జీ ఎఫ్ రాష్ట్ర స్థాయి క్రీడలలో విజయం సాధించిన విద్యార్థులకు వెల్లువెత్తుతున్న అభినందనలు
