
SP Chandrayya
అదనపు ఎస్పీ ని అభినందించిన జిల్లా న్యాయమూర్తి
సిరిసిల్ల టౌన్:( నేటిధాత్రి )
రాజన్న సిరిసిల్ల జిల్లా అదనపు ఎస్పీ డి. చంద్రయ్య ను స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చేతుల మీదుగా ప్రెసిడెంట్ పోలీస్ మెడల్ అందుకున్న సందర్భంగా సిరిసిల్ల జిల్లా న్యాయమూర్తి నీరజ ఈరోజు కోర్టు ఆవరణలో అదనపు ఎస్పీకి పుష్పగుచ్చము ఇచ్చి అభినందించారు. అంతే కాకుండా జిల్లా న్యాయమూర్తి నీరజ మాట్లాడుతూ ఉద్యోగరీత్య, కర్తవ్య రీత్య, ప్రజలకు అందుబాటులో ఉంటూ శాంతి భద్రతల దృష్ట్యా, సామాజికంగా గాని, ఎల్లవేళలా సేవ, సహ సహకారం అందించినటువంటి ఉద్యోగులకు మంచి గౌరవం దక్కుతుందని తెలిపారు. అలాగే జిల్లా కోర్టులోఉన్న తదితర న్యాయవాదులు, అదనపుఎస్పీ అభినందించారు