నాగజ్యోతక్క గెలుపుకోసం పూజలు నిర్వహించిన బిఆర్ఎస్ నాయకులు

గంగారం,నేటిధాత్రి :

ములుగు నియోజకవర్గం లోని గంగారం మండలం కోమాట్లగూడెం గ్రామంలో మండల అధ్యక్షుడు ఇర్ప సూరయ్య ఆధ్వర్యంలో బిఆర్ఎస్ గ్రామ కమిటీ అధ్యక్షుడు దుర్గం రాములు ములుగు బిఆర్ఎస్ పార్టీ అభ్యర్ధి బడే .నాగ జ్యోతక్క అఖండ మెజారిటీతో గెలవాలని మళ్ళీ కెసిఆర్ సీఎం కావాలని ఊళ్ళో ఉన్న గ్రామ దేవతలు బొడ్రాయిల దగ్గర పూజలు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పురోహితులు కాసుల కృష్ణమాచారి వేదమంత్రాలతో పూజలు నిర్వహించడం జరిగింది కార్యక్రమంలో మండల నాయకులు చేన్నురి వెంకన్న పిఏసిఏస్ డైరెక్టర్ దుర్గం సమ్మయ్య, గోగ్గల లక్ష్మయ్య దుర్గం సాంబయ్య దుర్గం నారాయణ జనగాం వెంకన్న, పయిరి శంకర్ , జాడి పాపయ్య,జనగం తిరుపతి, జనగాం శ్రీను దుర్గం సాంబయ్య సోషల్ మీడియా కోఆర్డినేటర్ జనగం రవి తదితరులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *