వీణవంక,( కరీంనగర్ జిల్లా):
నేటి ధాత్రి:
వీణవంక మండల కేంద్రంలో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ గారి మృతి పట్ల మండల కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఎండీ సాహెబ్ హుస్సేన్
శ్రద్ధాంజలి ఘటించి నివాళులర్పించి రెండు నిమిషాలు మౌనం పాటించడం జరిగింది ఈ సందర్భంగా ఎండీ సాహెబ్ హుస్సేన్ మాట్లాడుతూ, మన భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ గారు నిన్న రాత్రి మృతి చెందడం పట్ల ఈరోజు మన రాష్ట్ర ప్రభుత్వం సెలవుదినంగా ప్రకటించింది.మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ గారు ఆర్థిక మంత్రిగా వాణిజ్య మంత్రిగా ఆర్థిక సలహాదారుగా మన దేశం ఆర్థిక సంక్షోభంలో ఉన్నప్పుడు ఆర్థిక సంస్కరణలు తీసుకువచ్చిన నాయకులు మన్మోహన్ సింగ్ గారు రెండుసార్లు మన దేశానికి ప్రధానమంత్రిగా చేసిన ఘనత మన్మోహన్ సింగ్ గారికి దక్కుతుందని సమాచార హక్కు చట్టం, మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం ప్రవేశపెట్టినటువంటి మహోన్నతమైన వ్యక్తి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో ముఖ్య భూమిక ను ప్రోషించినటువంటి మన్మోహన్ సింగ్ గారు నేడు మన మధ్యలో లేకపోవడం చాలా బాధాకరం కాంగ్రెస్ పార్టీకి తీరని లోటు
ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు గంగాడి రాజి రెడ్డి, మాజీ సర్పంచ్ కర్ర తిరుపతి రెడ్డి, మండల మైనార్టీ సెల్ అధ్యక్షులు ఎండీ ఎజాజ్ పాషా, నాయకులు కాంతాల కొండల్ రెడ్డి, దిలీప్, యువజన కాంగ్రెస్ మండల ప్రధాన కార్యదర్శి దాసరపు రాకేష్, మోటం ఐలయ్య, వడ్డేపల్లి ఓదెలు, రెడ్డి రాజుల పోచాలు, ఓరేం బాబురావు తదితరులు పాల్గొన్నారు.