పహెల్గమ్ ఉగ్రదాడిని ఖండించండి
మృతి చెందిన కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి
నర్సంపేట నేటిధాత్రి:
జమ్మూ కాశ్మీర్ లోని పల్గామ పర్యటక ప్రాంతంలో ఉగ్ర మూకలు జరిపిన కాల్పుల్లో మృతి చెందిన కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలుపుతూ బిఆర్ఎస్ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో అంబేద్కర్ సెంటర్లో మౌనం పాటించారు.
ఘటనను ఖండిస్తూ నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలపడం జరిగింది. ఈ సందర్భంగా బిఆర్ఎస్ జిల్లా నాయకులు నల్ల మనోహర్ రెడ్డి పట్టణ అధ్యక్షుడు నాగేల్లి వెంకటనారాయణ మాట్లాడుతూ కేంద్ర హోంశాఖ వైఫల్యంతో ఈ ఘటన జరిగిందని నిగ్గు వర్గాలు హెచ్చరించిన ముందు జాగ్రత్త చర్యలు తీసుకోకుండా ఉండటంవల్లే ఈ ప్రమాదం జరిగిందని ఆరోపించారు.
దీనికి నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర హోంశాఖ మంత్రి రాజీనామా చేయాలని మృతి చెందిన కుటుంబాలను కేంద్ర ప్రభుత్వం కుటుంబానికి 50 లక్షల ఎక్స్గ్రేషియా ఇచ్చి ఆదుకోవాలని డిమాండ్ చేశారు.
ఉగ్రవాదాన్ని కూకటి వేళ్ళతో పెకిలించి అంతమొందిస్తామని బిజెపి పార్టీ అధికారంలోకి వచ్చిన నాటి నుండి చెప్పుతూ రాజకీయ లబ్ధికే వాడుకుంటుంది తప్ప ఆచరణలో సాధ్యం కావడం లేదని గతంలో జరిగిన పుల్వామా దాడి నుండి నేటి వరకు దేశంలో అనేక చోట్ల ఇలాంటి మారణ హోమాలు జరగటమే నిదర్శనమని అన్నారు.
దేశ భద్రత కోసం ఉగ్రవాదం అంతం అందించడానికి ఎలాంటి చర్యలు తీసుకున్న బిఆర్ఎస్ పార్టీ మద్దతు ఉంటుందని అన్నారు.
ఈ కార్యక్రమంలో బిఆర్టియు జిల్లా అధ్యక్షులు గోనే యువరాజు, సీనియర్ నాయకులు రామారావు, మాజీ కౌన్సిలర్లు బండి రమేష్, మండల శ్రీనివాస్, శివరాత్రి స్వామి వాసం సాంబయ్య దేవూజు సదానందం, పెండెం వెంకటేశ్వర్లు, బీసీ సెల్ పట్టణ అధ్యక్షుడు పుల్లూరి స్వామి, వార్డు అధ్యక్షులు బీరం నాగిరెడ్డి, సంపంగి సాలయ్య, పెరమండ్ల రవి, రావుల సతీష్, రాయరాకుల సారంగం, రచ్చ రఘు, కుంకీసా కుమార్ రుద్రారపు పైడయ్య, గుండెబోయిన కోటి, పోతరాజు బాబు గౌడ సంఘం అధ్యక్షుడు గిరిగాని సాంబయ్య నాయకులు పైసా ప్రవీణ్, తోట సదానందం గోనెల కర్ణాకర్, మద్దెల సాంబయ్య భోలే పాషా రాపోలు రాములు రాపోలు శీను, రాపోలు సురేందర్ తదితరులు పాల్గొన్నారు.