సీఎం కప్ క్రీడల ముగింపు కార్యక్రమం.

విజేతలకు బహుమతులు అందజేసిన మధు వంశీకృష్ణ.

చిట్యాల,నేటిధాత్రి :

విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లో రాణించాలని మార్కెట్ చైర్పర్సన్ గుమ్మడి శ్రీదేవి కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి ముఖిరాల మధువంశీకృష్ణ అన్నారు,చిట్యాల మండల స్థాయి క్రీడలు మండల క్రీడల కన్వీనర్ ఎంపీడీవో జయశ్రీ ఆధ్వర్యంలో మూడు రోజులపాటు జరిగిన క్రీడల పోటీలు చివరి రోజు ఘనంగా ముగిశాయి అని తెలిపారు, ఈ ముగింపు వేడుకలకు ముఖ్య అతిథులుగా స్పెషల్ ఆఫీసర్ చిన్నయ్య డివైఎస్ఓ చిర్రా రఘు హాజరైనారు ఈ క్రీడలకు 250 మంది క్రీడాకారులు హాజరైనారని వారికి భోజన వసతి మార్కెట్ చైర్మన్ గుమ్మడి శ్రీదేవి ఏర్పాటు చేశారని క్రీడల సమన్వయకర్త సూధం సాంబమూర్తి తెలిపారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లో పాల్గొంటే మంచి భవిష్యత్తు ఉంటుందని తెలిపారు క్రీడల్లో గెలుపొందిన వారికి కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి మధువంశీకృష్ణ బహుమతులు అందజేశారు.ఈ కార్యక్రమంలో మండల విద్యాధికారి కోడెపాక రఘుపతి ఎంపీ ఓ రామకృష్ణ టౌన్ అధ్యక్షులు బుర్ర లక్ష్మణ్ గౌడ్. దబ్బెట్ట అనిల్. కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యదర్శి రాయకోమురు మాజీ కోఆప్షన్ సభ్యులు రాజ్ మహమ్మద్ ఏబీవీపీ నాయకులు వేల్పుల రాజకుమార్. కాంగ్రెస్ పార్టీ యూత్ అధ్యక్షులు అల్లగొండ కుమార్ . కట్కూరి నరేందర్ గుమ్మడి సత్యం .బుర్ర శ్రీనివాస్. గంగాధర్ రాజు. గంగాధరి రవీందర్ .ఫిజికల్ డైరెక్టర్లు బండి ప్రసాద్. సరూప .రాణి .నూకల లింగయ్య .గాజర్ల శ్రీనివాస్. ఉమా. వెన్నెల .శారద. చల్ల శ్రీనివాస్. రెడ్డి గ్రామ కార్యదర్శి రవికుమార్. తదితరులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!