భారత కమ్యూనిస్టు పార్టీ కార్యదర్శిగా ఎన్నికైన .!

భారత కమ్యూనిస్టు పార్టీ కార్యదర్శిగా ఎన్నికైన కామ్రేడ్ రామడుగు లక్ష్మణ్ ని ఘనంగా సన్మానించడం జరిగింది.

బెల్లంపల్లి నేటిధాత్రి :

 

 

భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ బెల్లంపల్లి పట్టణ సమితి సమావేశం కామ్రేడ్ భాశెట్టి గంగారం భవన్లో గురువారం రోజున ఉదయం 10 గంటలకి జరిగింది. ఈ కార్యక్రమంలో మంచిర్యాల జిల్లా భారత కమ్యూనిస్టు పార్టీ కార్యదర్శిగా ఎన్నికైన కామ్రేడ్ రామడుగు లక్ష్మణ్ ని ఘనంగా సన్మానించడం జరిగింది లక్ష్మణ్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సందర్భంగా ప్రజలకు ఇచ్చిన 6 గ్యారంటీలను చిత్తశుద్ధితో అమలు పరచాలి అని ఆపరేషన్ కగర్ పేరుతో కేంద్ర ప్రభుత్వం మావోయిస్టు పార్టీ పైన జరుపుతున్నవ మారనా హోమాన్ని వెంటనే రద్దు చేసుకొని వారితో శాంతి చర్చలు జరిపి మానవ హక్కులను కాపాడాలి, గిరిజనులు వ్యవసాయం చేసుకుంటూ పోరు భూములను పట్టాలు ఇవ్వాలి అలాగే ఎన్నిక హామీల్లో భాగమైన పేద వర్గాల కు నూతన రేషన్ కార్డులను వెంటనే ఇవ్వాలి.

 

 

 

 

 

రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఎన్నికల హామీల ప్రకారం కార్పొరేషన్ పరిధిలో ఉన్న బొగ్గు గనుల ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం ఇంటికి రాయి యాజమాన్యం చెల్లించాలి, బొగ్గు గాని కార్మికులకు సొంత ఇంటి పథకంలో భాగంగా రెండు గంటల భూమి వారికి సంబంధించిన బడ్జెట్ సపోర్ట్ ను యాజమాన్యం కల్పించాలి. భారత కమ్యూనిస్టు పార్టీ దాని అనుబంధ ప్రజా సంఘాలు మంచిర్యాల జిల్లాలో బలమైన నిర్మాణం కలిగి ఉన్న నేపథ్యంలో పార్టీ ఆఫీసు కు జిల్లా కేంద్రంలో ఒక ఎకరం భూమి కేటాయించాలి 2024. 25 సంవత్సరానికి సంబంధించిన సింగరేణి లాభాలను ప్రకటించి గని కార్మికులకు 40 శాతం వాటాను ప్రకటించాలి.

 

 

 

 

సింగరేణి నూతన బొగ్గు బ్లాక్లను కేంద్ర ప్రభుత్వం కేటాయించాలి, బెల్లంపల్లిలో బస్సు డిపోను నిర్మించాలి అని అన్నారు బెల్లంపల్లి పట్టణ సమితి ఆధ్వర్యంలో జిల్లా కార్యదర్శి రామడుగు లక్ష్మణ్ ని శాలువా పూలదండలతో ఘనంగా సత్కరించారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర సమితి సభ్యులు మిట్టపల్లి వెంకట స్వామి రాష్ట్ర సమితి సభ్యురాలు బొల్లం పూర్ణిమ సిపిఐ సీనియర్ నాయకులు చిప్ప నరసయ్య పట్టణ కార్యదర్శి ఆడపుq రాజమౌళి, సహాయ కార్యదర్శి బొల్లం తిలక్ , జిల్లా సభ్యులు గుండా చంద్రమాణిక్యం, డి ఆర్ శ్రీధర్, కొంకుల రాజేష్, సీనియర్ మహిళా కామ్రేడ్ గుండ సరోజ, బొల్లం సోని, బియ్యాల ఉపేందర్, కొండు బానేష్, అక్కేపల్లిబాబు సార్, రత్నం రాజం ,తిరుపతి గౌడ్, మంతెన రమేష్, బండారి శంకర్, బోర్ల సమ్మయ్య, గోలేటి రాజలింగు, నస్పూరి తిరుమలేష్, గుండ ప్రశాంత్, అంబాల ప్రభుదాస్ నస్పూరి సందీప్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!