
సమగ్ర కుటుంబ సర్వే డ్యూటీ సర్టిఫికెట్లు ఇవ్వగలరు
రాయికల్ నేటి ధాత్రి :
తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం (TPUS )రాయికల్ మండల శాఖ పక్షాన సమగ్ర కుటుంబ సర్వేలో పాల్గొన్న రాయికల్ మండల ఉపాధ్యాయులకు డ్యూటీ సర్టిఫికెట్స్ అందజేయుట గురించి రాయికల్ మండల పరిషత్ కార్యాలయం లో ఎపిఓ కండ్లె సుష్మ సూపరింటెండెంట్ యస్.ప్రవీణ్ గార్లకు వినతి పత్రం అందజేశారు.ఈ కార్యక్రమంలో తపస్ జిల్లా బాధ్యులు చెరుకు మహేశ్వర శర్మ, వేముల మధు, మండల శాఖ అధ్యక్షులు కొండూరి రజనీకాంత్ సభ్యులు పి.రమేశ్ తదితరులు పాల్గొన్నారు.