సింగరేణి సంస్థ నిధులతో నిర్మించిన కమిటీ హాల్

జైపూర్, నేటి ధాత్రి:

మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి టేకుమట్ల మినీ ఫంక్షన్ హాల్ ఓపెనింగ్ వచ్చిన సందర్భంగా సర్పంచ్ గోనె సుమలత ,నర్సయ్య మరియు టేకుమట్ల, ఇందారం నాయకులు కలిసి కమిటీ హాల్ పక్కనే ఉన్న స్థలంలో డైనింగ్ హాల్ కిచెన్ షెడ్ నిర్మించాలని కోరడం జరిగింది. అదేవిధంగా ఇందారం, టేకుమట్ల మధ్యలో ఉన్నటువంటి సర్వే నెంబర్ 286 లో పది ఎకరాల స్థలంలో మినీ స్టేడియం ఓపెన్ జిమ్ వాకింగ్ ట్రాక్ మరియు విద్యుత్ స్తంభాలు వేయించి ఇవ్వాలని కోరడం జరిగింది. వెంటనే స్పందించిన ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి శ్రీరాంపూర్ సింగరేణి జిఎం సంజీవ రెడ్డి, ఎమ్మెల్యే వివేక్ స్థలం పరిశీలన చేసి వెంటనే పనులు ప్రారంభించాలని ఆదేశించారు.అలాగే లోకల్ యువత ఉద్యోగ అవకాశాల గురించి మరల గుర్తు చేయడం జరిగింది.80% స్థానికులకే అవకాశాలు ఇవ్వాలని జి ఎం కి మళ్లీ ఒకసారి గుర్తు చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!