కలెక్టర్లు ఎనుమరెటర్ లతో విస్తృతంగా మాట్లాడాలి

మంత్రులు, ఎమ్మెల్యేల కు సమాచారం ఇవ్వండి

దేశం మొత్తం తెలంగాణను గమనిస్తుంది

సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే వీడియో కాన్ఫరెన్స్లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నేటి ధాత్రి

కొత్తగూడెం టౌన్ .హౌస్ లిస్టింగ్ పూర్తిచేసుకుని నేటి నుంచి ఇంటింటి సర్వే ప్రారంభమవుతున్న నేపథ్యంలో కలెక్టర్లు ఏనుమరెటర్లతో విస్తృతంగా మాట్లాడాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు. శనివారం సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే పై ఉన్నతాధికారులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో ఆయన మాట్లాడారు. ఐ డి ఓ సి కార్యాలయం నుండి జిల్లా కలెక్టర్ జితేష్ వి
పాటిల్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విద్యా చందనతో కలిసి పాల్గొన్నారు. నేటి నుంచి ఇంటింటి సర్వే ప్రారంభమవుతున్న నేపథ్యంలో ప్రజల నుంచి అనేక సందేహాలు వ్యక్తమవుతుంటాయి, కలెక్టర్లు ఎనుమరెటర్ ల తో ఎప్పటికప్పుడు మాట్లాడితే ప్రజల సందేహాలు ఏంటో వెను వెంటనే తెలుసుకునే అవకాశం కలుగుతుందని తెలిపారు. ప్రజల సందేహాలను కలెక్టర్లు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువచ్చి ప్రజల అనుమానాలను ఎప్పటికప్పుడు నివృత్తి చేయాలని ఆదేశించారు. మంత్రులు, ఎమ్మెల్యేలు ఎక్కువ సార్లు సర్వేలో భాగస్వాములు అయ్యేలా చూడాలని అధికారులను కోరారు. సమగ్ర కుటుంబ సర్వే చాలా పెద్ద కార్యక్రమం, ఇలాంటి కార్యక్రమాన్ని ఇప్పటివరకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ముందుకు తీసుకెళుతున్న అధికారులను డిప్యూటీ సీఎం అభినందించారు. క్వశ్చనీర్ పకడ్బందీగా రూపొందించారు, ఎనిమరేటర్లకు బాగా శిక్షణ ఇచ్చారు, హౌస్ లిస్ట్ కూడా విజయవంతంగా పూర్తి చేశారు. ఇదే రీతిలో కుటుంబ సర్వేను విజయవంతంగా నిర్వహించాలని కోరారు. ఈ దేశంలో జరిగే అతిపెద్ద కార్యక్రమం ఇది.. మనం చూపే నిబద్ధతపైనే ఈ సర్వే విజయవంతం అవడం ఆధారపడి ఉంటుంది అన్నారు. యావత్ దేశం మొత్తం తెలంగాణ రాష్ట్రం చేపడుతున్న కుటుంబ సర్వేను గమనిస్తుందని వివరించారు. ఈ దేశంలో ప్రగతిశీల భావాలను, కార్యక్రమాలను వ్యాప్తి చేయడానికి ఈ సర్వే గొప్పగా ఉపయోగపడుతుందని తెలిపారు. జిల్లా కలెక్టర్లు ప్రతి చిన్న విషయం కూడా నిర్లక్ష్యం చేయకుండా ప్రణాళిక శాఖ ముఖ్య కార్యదర్శి, ఇతర ఉన్న అధికారుల దృష్టికి తీసుకువెళ్లాలని ఎప్పటికప్పుడు సమస్యలు పరిష్కరించుకోవాలని తెలిపారు. సర్వేపై కలెక్టర్లతో పాటు అన్ని స్థాయిలోని అధికారులు విస్తృత ప్రచారం నిర్వహించాలని ఆదేశించారు. ప్రధానంగా పట్టణాలపై దృష్టి పెట్టాలని కోరారు. కార్యక్రమంలో చీఫ్ సెక్రటరీ శాంత కుమారి, ప్రణాళిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా యితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

అనంతరం జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ క్షేత్రస్థాయి అధికారులతో టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ నేటి నుండి ప్రారంభమైన సమగ్ర కుటుంబ ఇంటింటి సర్వే లో భాగంగా ప్రతి ఎన్యుమరేటర్ ప్రతి కుటుంబం యొక్క ఖచ్చితమైన సమాచారాన్ని నమోదు చెయ్యాలని ఆదేశించారు.సర్వేలో ప్రజల నుండి వచ్చే సందేహాలను ఎప్పటికప్పుడు నివృత్తి చేయాలని, ఏదైనా సమస్య ఉంటే వెంటనే పై అధికారులు దృష్టికి తీసుకురావాలని ఆదేశించారు. సేకరించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు ఆన్లైన్లో ఎటువంటి పొరపాట్లుకి తాగు లేకుండానమోదు చేయాలని సూచించారు.సేకరించిన సమాచారాన్ని గోప్యతగా ఉంచాలని అన్నారు. ప్రతి ఎన్యుమరేటర్ సేకరించిన సమాచారం వారికి కేటాయించిన కేంద్రాల వద్ద డేటా ఎంట్రీ ఆపరేటర్ ద్వారా సమాచారాన్ని నిర్దిష్ట సమయంలో ఆన్లైన్ చేయాలని ఆదేశించారు.సూపర్ వైజర్లు మధ్యాహ్నం నుంచి క్షేత్రస్థాయిలో సర్వేను పర్యవేక్షించాలన్నారు.ప్రజల సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, భూమి, రుణాలు, వ్యవసాయం, స్థిరాస్తి, రేషన్ సహా పలు అంశాలపై ఎన్యుమరేటర్లు ఖచ్చితమైన వివరాలు సేకరించిందన్నారు. సర్వే సమయంలో ఆధార్‌, ధరణి పాస్‌బుక్‌, పాన్, రేషన్ కార్డు, సెల్‌ఫోన్‌ నంబర్లు కూడా నమోదు చెయ్యాలి, కాబట్టి ఆయా పత్రాలు దగ్గర పెట్టుకునేలా ప్రజలకు అవగాహన కల్పించాలి అని అన్నారు. ఒక్కో కుటుంబ వివరాల సేకరణకు 10-20 నిమిషాలు పట్టే అవకాశం ఉన్నందున పత్రాలు దగ్గర పెట్టుకుంటే ఎన్యుమరేటర్లు వచ్చినప్పుడు వివరాలు చెప్పడం సులభం అవుతుందని, మొత్తం వివరాలు పూర్తయ్యాక తాను చెప్పిన వివరాలన్నీ నిజమేనని ప్రకటిస్తున్నట్లుగా కుటుంబ యజమాని సంతకం తీసుకోవాలన్నారు.

ఈ కార్యక్రమంలోసిపిఓ సంజీవరావు, కలెక్టరేట్ ఏవో రమాదేవి సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!