ఇంటర్ పరీక్ష కేంద్రాల్లో కలెక్టర్ ఆకస్మిక తనిఖీ.

inter examination

ఇంటర్ పరీక్ష కేంద్రాల్లో కలెక్టర్ ఆకస్మిక తనిఖీ

సిరిసిల్ల(నేటి ధాత్రి):

జిల్లాలోని పలు ఇంటర్మీడియట్ ఫస్టియర్ పరీక్ష కేంద్రాలను కలెక్టర్ సందీప్ కుమార్ ఝా బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల, సహస్ర జూనియర్ కళాశాల, సాయి శ్రీ జూనియర్ కళాశాలల్లో ఏర్పాటు చేసిన ఇంటర్మీ డియట్ ఫస్టియర్ పరీక్ష కేంద్రాలను కలెక్టర్ తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా సహస్ర జూనియర్ కళాశాల, సాయి శ్రీ జూనియర్ కళాశాలల్లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను తనిఖీ చేశారు. ఆయా కేంద్రాల్లో విద్యార్థులు పరీక్షలు రాస్తుండగా కలెక్టర్ పరిశీలించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!