రామడుగు, నేటిధాత్రి:
కరీంనగర్ జిల్లా రామడుగు మండల కేంద్రంలో గత ఐదేళ్ల క్రితం 7.90 కోట్ల రూపాయలతో పనులు ప్రారంభించిన బ్రిడ్జిని జిల్లా కలెక్టర్ పమీల సత్పతి, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం పరిశీలించారు. ఈకార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ ప్రపుల్ దేశాయ్, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బొమ్మరవేని తిరుపతి ముదిరాజ్, తహశీల్దార్ భాస్కర్, ఎంపిడివో రాజేశ్వరి, ఎస్ఐ నేరెళ్ళ రమేష్ గౌడ్, ఎపివో రాధ, ఆర్ఐ బాలకిషన్, తదితరులు పాల్గొన్నారు.